UPDATES  

NEWS

సేవే పరమార్ధం… నిరుపేద నిరాశ్రయుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వెంకీ కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ… శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మొహమ్మద్ మగ్దూమ్… కనబడుటలేదు చిట్టేపల్లి తిప్పపై కాలనీ నిర్మాణంలో చిత్రవిచిత్రాలు…YCP పాలనలో జరిగిన దోపిడీకి పరాకాష్టగా పొదలకూరులోని చిట్టేపల్లి తిప్ప కాలనీ కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం.. సిపిఐ, ఏఐవైఎఫ్ (AIYF) ఆధ్వర్యంలో ఇంటి పట్టాల కొరకు ధర్నా చేసిన వెంగారెడ్డి కండ్రిగ గ్రామ ప్రజలు… తప్పిపోయిన పాపను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన రూరల్ ఎస్సై మనోజ్ కుమార్. సంపాదనలో లేని సంతృప్తి సేవలోనే ఉంది : ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మగ్ధూమ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, స్వర్ణాంధ్ర భారతి పాఠశాల పై… విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి :ఏబీవీపీ

Select your language

 డీజే టిల్లుతో జోడి కట్టనున్న బేబీ హీరోయిన్?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ- బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) హీరోయిన్ గా నటించబోతుందనే తెలుస్తోంది. బేబీ హిట్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది వైష్ణవి. అందులో ఈ అమ్మడు యాక్టింగ్ కు ఫిదా అవ్వని యూత్ ఎవరూ ఉండరు. దీంతో ఈమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామ్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సిద్ధూ సినిమాలో అవకాశం దక్కించుకుంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్'(Tillu Square)లో నటిస్తున్నాడు. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధు నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ పై మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి రామ్‌ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. టైటిల్‌కు తగ్గట్టుగానే డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించబోతున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఈ చిత్రాన్ని అక్టోబరు 06న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE