
MF4TV:తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణం అడవి కాలనీ నందు ఉన్న గాడ్స్ లవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలో ఈ రోజు 23-04-2025,తేదీన బుధవారం గూడూరు పట్టణానికి చెందిన కీ,,శే,,శ్రీమతి చిగురువాడ కాత్యాయని జ్ఞాపకార్థం 7 సంవత్సరికం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కుమారుడు సుధాకర్, కోడలు మమతమ్మ, సహాయ,సహకారాలతో కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ
ఈరోజు దాతగా వ్యవహరించిన సుధాకర్, మమతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు తన తల్లి వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, పిల్లలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఇలా ప్రతి ఒక్కరు తమ తమ కుటుంబంలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా ఆశ్రమాలలో నిర్వహించి వారికి అండగా నిలిచి పలువురికి ఆదర్శంగా ఉండటం సంతోషదాయకమన్నారు..
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, అత్తి మంజరి గోపాలు, పర్వతల రమేష్, పేయ్యల రమణయ్య, సురేంద్ర, బండి వంశీకృష్ణ, దాతలు సుధాకర్,మమతమ్మ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు