
MF4TV: కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యుడు అత్తిమంజరి గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ…
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మాయాబజార్ లో ఉన్న సిపిఎం ఆఫీస్ నందు ఈరోజు 13-04-2025 ఆదివారం వ తేదీన కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యుడు అత్తిమంజరి గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు రామ శివకృష్ణ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు అనంతరం నిరుపేదలైన 20 మంది దివ్యాంగులకు అత్తిమంజరి గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ వారి చేతులు మిందగా కూరగాయలు పంపిణీ చేశారు.
అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ-రామ శివకృష్ణ జన్మదిన వేడుకులు ఇక్కడ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అలాగే దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం ద్వారా వారు తమ జీవనం సాఫీగా కొనసాగించేందుకు సహాయం లభిస్తుంది అని అన్నారు..
రామ శివకృష్ణ మాట్లాడుతూ ఈరోజు నా పుట్టినరోజు వేడుకలను పెద్దవాళ్ల సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు అదేవిధంగా మీ యొక్క ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలని అలాగే కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని నిజమైన పేదవారిని గుర్తించి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే అత్తిమంజరి గోపాల్ మాట్లాడుతూ ఈరోజు మా కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు కార్యక్రమం పేదవారి సమక్షంలో నిర్వహించడానికి ముఖ్య కారణం మా కుమారుడే వాడి సూచన మేరకే ఈ కార్యక్రమం నిర్వహించామని ఇంత చిన్న వయసులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మంచి ఉద్దేశం నా కుమారుడుకు ఉన్నందుకు మేము గర్విస్తున్నామని అన్నారు..
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు,అత్తిమంజరి గోపాల్,మల్లేశ్వరి, రామ శివకృష్ణ, పర్వతాల రమేష్, పెయ్యల రమణయ్య, చవల సురేంద్రబాబు,బండి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు..