
MF4TV:శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానం, కనుమరాయకొండ, అలిమిలి-కుందకూరు: ఏప్రిల్ 19 శనివారం ఆహ్లాదకరమైన వాతావరణంలో కనుమరాయకొండ పై వెలసియున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ (అన్నదానం) లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మన్నూరు గ్రామం వాస్తవ్యులు మతకాల సుబ్బరామయ్య, వేణు, విజయమ్మ, రామ్మోహన్, శారదమ్మ అన్నదాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్ 20-4-2025 ఆదివారం నుండి ఏప్రిల్ 23-4-2025 బుధవారం వరకు నూతనంగా నిర్మించిన ఆలయంలో నూతన శ్రీ సుదర్శన నారసింహస్వామి, శ్రీ రామానుజాచార్యుల శిలా విగ్రహాములు మరియు నూతన రాజగోపుర ప్రతిష్ట మహా సంప్రోక్షణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులు అందరూ పై కుంభాభిషేకం, హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుతూ… శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానం, కనుమరాయకొండ, అలిమిలి-కుందకూరు.