
MF4TV:ఈరోజు స్థానిక త్యాగరాజావీది లోని శ్రీ కళ్యాణవీరభద్ర స్వామి దేవస్థానములో రెడ్ సంస్థ ఆద్వర్యంలో ఇన్నర్ వీల్ & ఆంద్రమహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికీ దాతలు గా మన్నారపు ఉష మరియు డేగ సుప్రియ 5000/- అందజేశారు.
ఈ కార్యక్రమానికి Dr రోహిణమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా ఆంధ్ర మహిళా మండలి కార్యదర్శి విష్ణు వందన ,ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు Dr తనూజ కార్యదర్శి అనితా సభ్యులు స్నేహాలత, లక్ష్మీ ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్,కోడిపర్తి శ్రీధర్ ,పల్లం వెంకటేశ్వర్లు, మెదురు శ్రీనివాసఆచారి పాల్గొన్నారు