
MF4TV: తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నంది మండలం బాలకృష్ణం రాజు గారి దాతృత్వంలో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు నిరుపేద గర్భిణీ స్త్రీలకు వెజిటేబుల్ రైస్, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్స్ ను ముఖ్య అతిథులుగా వచ్చిన ఆసుపత్రి సూపరిoటెండెంట్ డాక్టర్ షరీనా మరియు డాక్టర్ రాజా గారి చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది.
అనంతరం షరీనా గారు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు 11 సంవత్సరముల నుండి నిరంతరాయంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు వారందరినీ అభినందిస్తున్నానని మరియు ఈరోజు దాతగా వ్యవహరించిన నంది మండలం బాలకృష్ణ రాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారికి వారి కుటుంబానికి భగవంతుడు అన్నివేళలా సహాయం చేయాలని కోరారు. ఆసుపత్రికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలు రానున్న ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రికి ముందుగా వచ్చి పరీక్షలు అన్నీ చేయించుకోవాలని *మీ రక్తం యొక్క శాతాన్ని మెరుగుపరుచుకుని మంచి బిడ్డకు జన్మనిచ్చినట్లయితే ఆసరా పథకం కింద 5000/- రూపాయలు మీ అకౌంట్ లో పడతాయని కావున మీరందరూ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని కోరారు. అనంతరం బాలకృష్ణo రాజు మాట్లాడుతూ నేను జే.వి.వి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని అవసరమైతే జే.వి.వి.వారితో కలిసి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తమ రావు, ప్రభాకర్, వెంకట్, సుబ్బారావు, సుమన్, రజనీకాంత్, మస్తాన్, ఇబ్రహీం, శ్రీనివాసాచారి, సాయి తదితరులు పాల్గొన్నారు.