
MF4TV: నిన్నటి రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఏఐవైఎఫ్ (AIYF) ఆధ్వర్యంలో మండల ఎంపీడీవో కార్యాలయం ఎదుట హౌసింగ్ కాలనీ, ఇంటి పట్టాల కొరకు వెంగారెడ్డి కండ్రిగ గ్రామ ప్రజలు ధర్నా చేయడం జరిగింది. వెంగారెడ్డి కండ్రిక గ్రామంలో గత 40 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న ఇల్లు స్థలాలు లేని దుస్థితి ఉన్నదని…. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం, ఆశ ఉంది మాకు ఇండ్లు, ఇంటి పట్టాలు ఇస్తుందని చెప్పుకొచ్చారు హౌసింగ్ కాలనీ రావాలంటే ఇంటి ఇంటి పట్టా కావాలనేది ముఖ్యం చేశారు… కాబట్టి వెంగారెడ్డి కండ్రిగ 2 గ్రామాలను సర్వే చేసి కలెక్టర్ గారికి,RTO గారికి,ఎంఆర్ఓ(MRO) ద్వారా సర్వే నివేదికను పంపి రెండు గ్రామాలను గ్రామనత్తం చేసి ఇంటికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట వాపోయారు… ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ ప్రాసెస్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో సిపిఐ నాయకులు చంద్ర, ఏఐవైఎఫ్(AIYF) నియోజకవర్గ అధ్యక్షులు. సి మురళి పాల్గొన్నారు