
MF4TV: తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఈరోజు 04-04-2025 వ తేదీ శుక్రవారం కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణం బజార్ వీధికి చెందినట్లు వంటి స్వర్గస్తులైన సొల్లేటి రత్నమ్మ సంవత్సరికం వారి జ్ఞాపకార్థకంగా భర్త గోపాల్ స్వామి, కూతుర్లు లక్ష్మి, సువర్ణ, అల్లుడులు కిషోర్, శ్రీనివాసులు ల సహాయ సహకారాలతో
వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సువర్ణ మాట్లాడుతూ సేవ చేయడమే లక్ష్యంగా తమ వంతు ఇ చిన్న సహాయంగా కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని.దేవుడు సహకరిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని.
ఇలాంటి సేవ, సహాయక కార్యక్రమాలు చేయడానికి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి నిరుపేదలకు సేవలు అందించాలని సువర్ణ కోరారు.
కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ:-వృద్ధాశ్రమాలలో అన్నదానం అనేది వృద్ధులకు భోజనం అందించడం ద్వారా వారి అవసరాలను తీర్చడానికి సహాయపడే ఒక మంచి పని. అని దీని ద్వారా వృద్ధులకు సహాయం చేయడమే కాకుండా, సమాజానికి సేవ చేసిన భావన కలుగుతుంది.అని అన్నారు.
అలాగే ఎవరైనా దాతలు ఉంటే మీ కుటుంబంలో జరిగే శుభకార్యాలు,పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి కార్యక్రమాలును వృద్ధాశ్రమంలో జరుపుకోవాలని అలా జరుపుకునే దాతలు ఎవరైనా ఉంటే మా కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులును సంప్రదించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో అత్తి మంజరి గోపాల్, పేయ్యల రమణయ్య, చవల సురేంద్రబాబు, పర్వతాల రమేష్ బాబు,,ఓం సాయిరాం చారిటీస్ నిర్వాహరాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు……