
గూడూరు: మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మొహమ్మద్ మగ్దూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాలనుండి రంజాన్ మాసంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తూ వస్తున్నాం ఇది 17 వ సంవత్సరం అని అన్నారు ఈ సంవత్సరం కూడా 1000 మందికి నిరుపేద మహిళలకు గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల వారికి అందజేయనున్నామని అందులో భాగంగా మార్చి నెల 4 వ తేది బుధవారం గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్ నందు ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగుతుందని కావున గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి నిరుపేద మహిళలు ఉదయం 8 గంటలకు షాదీ మంజిల్ వద్దకు వచ్చి టోకెన్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామని ఇప్పటికే టోకెన్ల పంపిణీ ప్రక్రియ మొదలయిందని ఎం ఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మొహమ్మద్ మగ్దూం తెలిపారు కావున ఈ అవకాశాన్ని అవసరమైన వారు ఉపయోగించుకోవలసిందిగా కోరారు.








