UPDATES  

NEWS

సేవే పరమార్ధం… నిరుపేద నిరాశ్రయుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వెంకీ కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ… శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మొహమ్మద్ మగ్దూమ్… కనబడుటలేదు చిట్టేపల్లి తిప్పపై కాలనీ నిర్మాణంలో చిత్రవిచిత్రాలు…YCP పాలనలో జరిగిన దోపిడీకి పరాకాష్టగా పొదలకూరులోని చిట్టేపల్లి తిప్ప కాలనీ కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం.. సిపిఐ, ఏఐవైఎఫ్ (AIYF) ఆధ్వర్యంలో ఇంటి పట్టాల కొరకు ధర్నా చేసిన వెంగారెడ్డి కండ్రిగ గ్రామ ప్రజలు… తప్పిపోయిన పాపను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన రూరల్ ఎస్సై మనోజ్ కుమార్. సంపాదనలో లేని సంతృప్తి సేవలోనే ఉంది : ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మగ్ధూమ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, స్వర్ణాంధ్ర భారతి పాఠశాల పై… విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి :ఏబీవీపీ

Select your language

DUVVURU RAMANAMMA WOMEN’S DEGREE COLLEGE – GUDUR:MEGA JOB MELA – 2025 Organized by: LAQSH Foundation

DUVVURU RAMANAMMA WOMEN’S DEGREE COLLEGE – GUDUR: MEGA JOB MELA – 2025 Organized by: LAQSH Foundation   Event Details: Date: Tuesday, 20th May 2025 Time: 8:00 AM to 5:00 PM Venue: DRW Degree College, Gudur, Tirupati (Dist.)   Opportunities: 500+ Jobs in  IT & Non-IT Sectors 10+ Participating Companies Salary Range: ₹1.5 LPA to ₹3.0 LPA   Eligibility (Passed out: 2020–2025): Intermediate ITI Diploma Any Degree B.Tech Any Post-Graduation   Documents Required: 5 Sets of Resumes Academic Certificates Aadhar Card   Top Participating Companies: Apollo Pharmacy MedPlus Sutherland AGS Health Care AdamsBridge TVS Brakes India All Set Solutions NELCAST And many more…   Contact for Details: D. Bhanuchandra Reddy – 9703683455 8332899508,9441236323

సేవే పరమార్ధం… నిరుపేద నిరాశ్రయుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వెంకీ

MF4TV: నేటి యువతరానికి ఆదర్శం…. వెంకీ తన ప్రతి పుట్టిన రోజు వేడుకను నిరుపేదలు, నిరాశ్రయులతో పంచుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు.. గత 7 సంవత్సరాలనుండి ఒక అలవాటుగా ఇష్టంగా చేస్తూ వస్తున్నాడు.. ఈ ఏడాది కూడా తన పుట్టినరోజు ను ప్రతి సంవత్సరం లాగే ఏదో ఒక రూపంలో తనకు చేతనైనంత సహాయం చేయాలనే ధృడ సంకల్పంతో పలు ప్రాంతాల్లో ఉన్న పేదలు మరియు ఆశ్రమాలలో వుండే వారికి చికెన్ బిర్యానీ, వాటర్ ప్యాకెట్లు, అరటిపండు, వడ మరియు పాయసం పంపిణీ చేశారు. అదే విధంగా, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 70 మంది యాచకులకు టోపీలను పంపిణీ చేశారు. ఈ విధమైన సేవా కార్యక్రమాలు సమాజానికి మంచి మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశిస్తూ, మా MF4TV తరఫున వెంకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాడ్స్ లవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలోని,వృద్ధులకు, పిల్లలకు అన్నదాన కార్యక్రమం..

MF4TV:తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణం అడవి కాలనీ నందు ఉన్న గాడ్స్ లవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలో ఈ రోజు 23-04-2025,తేదీన బుధవారం గూడూరు పట్టణానికి చెందిన కీ,,శే,,శ్రీమతి చిగురువాడ కాత్యాయని జ్ఞాపకార్థం 7 సంవత్సరికం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కుమారుడు సుధాకర్, కోడలు మమతమ్మ, సహాయ,సహకారాలతో కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు దాతగా వ్యవహరించిన సుధాకర్, మమతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు తన తల్లి వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, పిల్లలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఇలా ప్రతి ఒక్కరు తమ తమ కుటుంబంలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా ఆశ్రమాలలో నిర్వహించి వారికి అండగా నిలిచి పలువురికి ఆదర్శంగా ఉండటం సంతోషదాయకమన్నారు.. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, అత్తి మంజరి గోపాలు, పర్వతల రమేష్, పేయ్యల రమణయ్య, సురేంద్ర, బండి వంశీకృష్ణ, దాతలు సుధాకర్,మమతమ్మ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో వైభవంగా అభిషేకం మరియు అన్నదానం

MF4TV:శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానం, కనుమరాయకొండ, అలిమిలి-కుందకూరు: ఏప్రిల్ 19 శనివారం ఆహ్లాదకరమైన వాతావరణంలో కనుమరాయకొండ పై వెలసియున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ (అన్నదానం) లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మన్నూరు గ్రామం వాస్తవ్యులు మతకాల సుబ్బరామయ్య, వేణు, విజయమ్మ, రామ్మోహన్, శారదమ్మ అన్నదాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్ 20-4-2025 ఆదివారం నుండి ఏప్రిల్ 23-4-2025 బుధవారం వరకు నూతనంగా నిర్మించిన ఆలయంలో నూతన శ్రీ సుదర్శన నారసింహస్వామి, శ్రీ రామానుజాచార్యుల శిలా విగ్రహాములు మరియు నూతన రాజగోపుర ప్రతిష్ట మహా సంప్రోక్షణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులు అందరూ పై కుంభాభిషేకం, హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుతూ… శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానం, కనుమరాయకొండ, అలిమిలి-కుందకూరు.

పిగిలాం గ్రామంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు

MF4TV: బాలాయపల్లి మండలంలోని పిగిలాం గ్రామంలో పిగిలాం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నవభారత నిర్మాత, రాజ్యాంగపు ప్రదాత, బడుగు బహిష్కృత వర్గాల ఆశాజ్యోతి, మహనీయుడు డా. బి.ఆర్. అంబేడ్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిగిలాం గ్రామ యువకులు ప్రవీణ్, పవన్, అశోక్, రాజేష్, శ్రీనివాసులు, వంశీ, సూర్య, రాకేష్, సాయికిరణ్, వెంకటరమణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ…

MF4TV: కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యుడు అత్తిమంజరి గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ… తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మాయాబజార్ లో ఉన్న సిపిఎం ఆఫీస్ నందు ఈరోజు 13-04-2025 ఆదివారం వ తేదీన కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యుడు అత్తిమంజరి గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు రామ శివకృష్ణ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు అనంతరం నిరుపేదలైన 20 మంది దివ్యాంగులకు అత్తిమంజరి గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ వారి చేతులు మిందగా కూరగాయలు పంపిణీ చేశారు. అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ-రామ శివకృష్ణ జన్మదిన వేడుకులు ఇక్కడ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అలాగే దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం ద్వారా వారు తమ జీవనం సాఫీగా కొనసాగించేందుకు సహాయం లభిస్తుంది అని అన్నారు.. రామ శివకృష్ణ మాట్లాడుతూ ఈరోజు నా పుట్టినరోజు వేడుకలను పెద్దవాళ్ల సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు అదేవిధంగా మీ యొక్క ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలని అలాగే కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని నిజమైన పేదవారిని గుర్తించి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అత్తిమంజరి గోపాల్ మాట్లాడుతూ ఈరోజు మా కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు కార్యక్రమం పేదవారి సమక్షంలో నిర్వహించడానికి ముఖ్య కారణం మా కుమారుడే వాడి సూచన మేరకే ఈ కార్యక్రమం నిర్వహించామని ఇంత చిన్న వయసులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మంచి ఉద్దేశం నా కుమారుడుకు ఉన్నందుకు మేము గర్విస్తున్నామని అన్నారు.. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు,అత్తిమంజరి గోపాల్,మల్లేశ్వరి, రామ శివకృష్ణ, పర్వతాల రమేష్, పెయ్యల రమణయ్య, చవల సురేంద్రబాబు,బండి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మొహమ్మద్ మగ్దూమ్…

MF4TV గూడూరు: వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని సోమవారం ఉదయం జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరులో జరగనున్న శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని మైనార్టీ నాయకులు మత గురువు మొహమ్మద్ మగ్దూమ్ ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింల పై విద్వేషపూరితమైనటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు నిరసనగా భారతదేశం మొత్తం శాంతియుత నిరసన ర్యాలీలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే నెల్లూరు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నెల్లూరు కోటమిట్ట షాదీ మంజిల్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు జరిగే శాంతియుత ర్యాలీ కి ఉదయం 9 గంటలకు అందరూ పార్టీలకతీతంగా వర్గాలకతీతంగా ప్రతి ఒక్కరు తప్పకుండ హాజరుకావాలని ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసేంతవరకు మన గళాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని అందుకోసం జరిగేటటువంటి నిరసన ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరారు వాహనాల పార్కింగ్ కోసం జామియా నూరుల్ హుదా మద్రసా మూలపేట లో ఏర్పాటు చేసి వున్నారని మరియు రిటర్న్ లో దూరప్రాంతాల నుండి వచ్చిన వారందరికి జామియా నూరుల్ హుదా మద్రసా లో భోజనాలు ఏర్పాటు చేసివున్నారని అన్నారు. కావున ర్యాలీ కి వచ్చే ప్రతి ఒక్కరు నల్ల బ్యాడ్జి, నల్ల రిబ్బన్ కట్టుకొని వచ్చి నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మత గురువు మగ్ధూమ్,సయ్యద్ సలీం, కరిముల్లా పాల్గొన్నారు

కనబడుటలేదు

MF4TV: గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లి మసీదు దగ్గర షేక్ జుహీ, మూడో తరగతి చదువుతున్న ఈ పాప ఈరోజు 8-4-25 తేది ఉదయం నుంచి కనబడలేదు. ఈ పాప యొక్క ఆచూకీ తెలిసినవారు రెండవ పట్టణ పోలీసులను తెలియజేయగలరు.దయచేసి ఈ పాపకు సంబంధించిన సమాచారాన్ని 09703176602 నంబరుకు అందించగలరు

చిట్టేపల్లి తిప్పపై కాలనీ నిర్మాణంలో చిత్రవిచిత్రాలు…YCP పాలనలో జరిగిన దోపిడీకి పరాకాష్టగా పొదలకూరులోని చిట్టేపల్లి తిప్ప కాలనీ

MF4TV: చిట్టేపల్లి తిప్పపై కాలనీ నిర్మాణంలో చిత్రవిచిత్రాలు…YCP పాలనలో జరిగిన దోపిడీకి పరాకాష్టగా పొదలకూరులోని చిట్టేపల్లి తిప్ప కాలనీ చిట్టేపల్లి తిప్పపై కాలనీ నిర్మాణంలో చిత్రవిచిత్రాలు వైసీపీ పాలనలో జరిగిన దోపిడీకి పరాకాష్టగా పొదలకూరులోని చిట్టేపల్లి తిప్ప కాలనీ ఒకటిన్నర అడుగు లోతులోనే పిల్లర్..బేస్ మట్టానికి పిల్లర్ కు కనెక్షన్ లేకుండానే నిర్మాణాలు 902 ఇళ్లకు గాను పూర్తయింది ఒక్క ఇల్లే అపారమైన గ్రావెల్ సంపద కలిగిన చిట్టేపల్లి తిప్పకు మర్రిపల్లి నుంచి రూ.2 కోట్ల విలువైన గ్రావెల్ తోలారంట ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల విషయంలోనూ అక్రమాలు జరిగాయని బాధితుల ఆవేదన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, హౌసింగ్ ఎండీ రాజాబాబుతో కలిసి కాలనీని సందర్శించిన సందర్భంగా అక్రమాలను చూసి విస్తుపోయిన మంత్రి కొలుసు పార్థసారది

కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం..

MF4TV: తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఈరోజు 04-04-2025 వ తేదీ శుక్రవారం కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణం బజార్ వీధికి చెందినట్లు వంటి స్వర్గస్తులైన సొల్లేటి రత్నమ్మ సంవత్సరికం వారి జ్ఞాపకార్థకంగా భర్త గోపాల్ స్వామి, కూతుర్లు లక్ష్మి, సువర్ణ, అల్లుడులు కిషోర్, శ్రీనివాసులు ల సహాయ సహకారాలతో  వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సువర్ణ మాట్లాడుతూ సేవ చేయడమే లక్ష్యంగా తమ వంతు ఇ చిన్న సహాయంగా కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని.దేవుడు సహకరిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని. ఇలాంటి సేవ, సహాయక కార్యక్రమాలు చేయడానికి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి నిరుపేదలకు సేవలు అందించాలని సువర్ణ కోరారు. కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ:-వృద్ధాశ్రమాలలో అన్నదానం అనేది వృద్ధులకు భోజనం అందించడం ద్వారా వారి అవసరాలను తీర్చడానికి సహాయపడే ఒక మంచి పని. అని దీని ద్వారా వృద్ధులకు సహాయం చేయడమే కాకుండా, సమాజానికి సేవ చేసిన భావన కలుగుతుంది.అని అన్నారు. అలాగే ఎవరైనా దాతలు ఉంటే మీ కుటుంబంలో జరిగే శుభకార్యాలు,పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి కార్యక్రమాలును వృద్ధాశ్రమంలో జరుపుకోవాలని అలా జరుపుకునే దాతలు ఎవరైనా ఉంటే మా కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులును సంప్రదించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో అత్తి మంజరి గోపాల్, పేయ్యల రమణయ్య, చవల సురేంద్రబాబు, పర్వతాల రమేష్ బాబు,,ఓం సాయిరాం చారిటీస్ నిర్వాహరాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు……

సిపిఐ, ఏఐవైఎఫ్ (AIYF) ఆధ్వర్యంలో ఇంటి పట్టాల కొరకు ధర్నా చేసిన వెంగారెడ్డి కండ్రిగ గ్రామ ప్రజలు…

MF4TV: నిన్నటి రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఏఐవైఎఫ్ (AIYF) ఆధ్వర్యంలో మండల ఎంపీడీవో కార్యాలయం ఎదుట హౌసింగ్ కాలనీ, ఇంటి పట్టాల కొరకు వెంగారెడ్డి కండ్రిగ గ్రామ ప్రజలు ధర్నా చేయడం జరిగింది. వెంగారెడ్డి కండ్రిక గ్రామంలో గత 40 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న ఇల్లు స్థలాలు లేని దుస్థితి ఉన్నదని…. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం, ఆశ ఉంది మాకు ఇండ్లు, ఇంటి పట్టాలు ఇస్తుందని చెప్పుకొచ్చారు హౌసింగ్ కాలనీ రావాలంటే ఇంటి ఇంటి పట్టా కావాలనేది ముఖ్యం చేశారు… కాబట్టి వెంగారెడ్డి కండ్రిగ 2 గ్రామాలను సర్వే చేసి కలెక్టర్ గారికి,RTO గారికి,ఎంఆర్ఓ(MRO) ద్వారా సర్వే నివేదికను పంపి రెండు గ్రామాలను గ్రామనత్తం చేసి ఇంటికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట వాపోయారు… ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ ప్రాసెస్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో సిపిఐ నాయకులు చంద్ర, ఏఐవైఎఫ్(AIYF) నియోజకవర్గ అధ్యక్షులు. సి మురళి పాల్గొన్నారు

తప్పిపోయిన పాపను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన రూరల్ ఎస్సై మనోజ్ కుమార్.

M4TV: తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఓ బాలిక ఏడుస్తూ ఉండడంతో గమనించిన అక్కడ స్థానికులు ఆ పాప వివరాలు అడగక నా పేరు గాయత్రి నేను 6 క్లాస్ మున్సిపల్ హైస్కూల్లో చదువుతున్నానని చెప్పింది ఇక్కడికి ఎలా వచ్చావని ఎవరు తీసుకొచ్చారని అడగక ఆటోలో వచ్చానని చెప్పింది తల్లిదండ్రుల పేర్లు అడగక తెలియదని సమాధానం ఇచ్చింది… ఎంతసేపటికి తల్లిదండ్రుల పేర్లు చెప్పకపోవడంతో స్థానికులు రూరల్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా స్పందించిన ఎస్సై మనోజ్ కుమార్ వారి సిబ్బందిని పంపించి పాప వివరాలు తెలుసుకొని పాపని వారి కుటుంబ సభ్యుల అయినా బాబాయి, చిన్నమ్మ అయినా వెంకటేశు,లక్ష్మీప్రసన్నలతో దిగువ వీరారెడ్డిపల్లి హరిజనవాడ లో ఉన్న వారి వద్దకు చేర్చడం జరిగింది. సకాలంలో పాపని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన ఎస్సై మనోజ్ కుమార్ ను మరియు వారి సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు.

సంపాదనలో లేని సంతృప్తి సేవలోనే ఉంది : ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మగ్ధూమ్

MF4TV: సంపాదనలో లేని సంతృప్తి సేవలోనే ఉంది : ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మగ్ధూమ్  

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, స్వర్ణాంధ్ర భారతి పాఠశాల పై… విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి :ఏబీవీపీ

పర్మిషన్ లేని బిల్డింగ్ లో ప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్న స్వర్ణంద్ర భారతి పాఠశాల యాజమాన్యం అన్ క్వాలిఫైడ్ స్టాప్ తో విద్యాబోధన ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన ఉపాధ్యాయులచే విద్యా బోధనలు ఎంతవరకు సబబు ఆటస్థలం లేకుండా పాఠశాల నడుపుతున్న స్వర్ణాంధ్ర భారతి దానికి నిదర్శనం పాఠశాల వార్షికోత్సవాన్ని వేరే స్థలంలో నిర్వహించారు అధిక ఫీజుల వసూలు చేస్తూ తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కుతూ వాళ్ళ ఇష్టం గా ఫీజులు వసూలు తల్లిదండ్రులు ఆవేదన వార్షికోత్సవం పేరుతో ఒక్కొక్క విద్యార్థి దగ్గర 700 వసూలు చేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు MF4TV: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉప విద్యాశాఖ అధికారి స్టాఫ్ కు వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు… ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ చిన్న మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అనేక పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అందులో భాగంగా రెండో పట్టణ పరిధిలో శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ప్రైమరీ పాఠశాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు కాకుండా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఫెయిల్ అయిన ఉపాధ్యాయులచే విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు, ఆట స్థలం లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా వార్షికోత్సవం పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుండి 700 రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నారని అందుకే అధికారులకు ఫిర్యాదు చేశామని ఏబీవీపీ నాయకుడు చిన్నా తెలియజేశారు వెంటనే ఉప విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని లేకపోతే ఉద్యమం తప్పదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి నజీర్ మరియు ఏబీవీపీ నాయకులు నవీన్ కృష్ణ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు

జే.వి.వి. ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ

MF4TV: తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నంది మండలం బాలకృష్ణం రాజు గారి దాతృత్వంలో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు నిరుపేద గర్భిణీ స్త్రీలకు వెజిటేబుల్ రైస్, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్స్ ను ముఖ్య అతిథులుగా వచ్చిన ఆసుపత్రి సూపరిoటెండెంట్ డాక్టర్ షరీనా మరియు డాక్టర్ రాజా గారి చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది. అనంతరం షరీనా గారు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు 11 సంవత్సరముల నుండి నిరంతరాయంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు వారందరినీ అభినందిస్తున్నానని మరియు ఈరోజు దాతగా వ్యవహరించిన నంది మండలం బాలకృష్ణ రాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారికి వారి కుటుంబానికి భగవంతుడు అన్నివేళలా సహాయం చేయాలని కోరారు. ఆసుపత్రికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలు రానున్న ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రికి ముందుగా వచ్చి పరీక్షలు అన్నీ చేయించుకోవాలని *మీ రక్తం యొక్క శాతాన్ని మెరుగుపరుచుకుని మంచి బిడ్డకు జన్మనిచ్చినట్లయితే ఆసరా పథకం కింద 5000/- రూపాయలు మీ అకౌంట్ లో పడతాయని కావున మీరందరూ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని కోరారు. అనంతరం బాలకృష్ణo రాజు మాట్లాడుతూ నేను జే.వి.వి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని అవసరమైతే జే.వి.వి.వారితో కలిసి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తమ రావు, ప్రభాకర్, వెంకట్, సుబ్బారావు, సుమన్, రజనీకాంత్, మస్తాన్, ఇబ్రహీం, శ్రీనివాసాచారి, సాయి తదితరులు పాల్గొన్నారు.

MF చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 70 మంది నిరుపేద మహిళలకు కాటన్ చీరలను పంపిణీ…

గూడూరు: గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్నటువంటి 70 మంది నిరుపేద మహిళలకు ఆదివారం ఉదయం మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాటన్ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మగ్దూమ్ మొహిద్దిన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ మాసంలో రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకొని నిరుపేద నిరాశ్రయులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని ఇది 16వ సంవత్సరము అని అన్నారు ముందుగా చర్చి వీధి పాత బస్టాండు గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు దుస్తులు పంపిణీ చేయడం ఆనవాయితీ అని అలాగే షాదీ మంజిల్లో 12 వ తేది బుధవారం ఉదయం 9 గంటలకు 786 దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఇప్పటికే టోకెన్లను పంపిణీ చేసి ఉన్నామని టోకెన్లు తీసుకోని వారు మా సంస్థ ప్రతినిధులను గాని లేదా నేరుగా కార్యక్రమం జరిగే రోజున ఉదయం 8 గంటలకు షాది మంజిల్ వద్దకు వస్తే టోకెన్లు తీసుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమం లోనే సమాజ సేవలో భాగస్వాములైనటువంటి వారిని సేవా గుణం కలిగినటువంటి వారిని సత్కరించబోతున్నామని ఆనందం వ్యక్తం చేశారు,మొహమ్మద్ అన్వర్ భాయ్ మాట్లాడుతూ గత 16 సంవత్సరముల నుండి ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో నేను కూడా హాజరవుతూ రావడం నాకు చాలా సంతోషాన్నిస్తుందని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని ముందుగా నిరుపేద నిరాశ్రయులైనటువంటి దివ్యాంగులకు వృద్ధులకు చర్చి వీధి కాంపౌండ్ నందు చీరలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మగ్దూమ్ మొహిద్దీన్, సంస్థ ప్రతినిధులు మొహమ్మద్ అన్వర్ భాయ్,షేక్ అబ్దుల్ రెహమాన్, కరిముల్లా, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

రెడ్ సంస్థ ఆద్వర్యంలో ఇన్నర్ వీల్ & ఆంద్రమహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

MF4TV:ఈరోజు స్థానిక త్యాగరాజావీది లోని శ్రీ కళ్యాణవీరభద్ర స్వామి దేవస్థానములో రెడ్ సంస్థ ఆద్వర్యంలో ఇన్నర్ వీల్ & ఆంద్రమహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికీ దాతలు గా మన్నారపు ఉష మరియు డేగ సుప్రియ 5000/- అందజేశారు. ఈ కార్యక్రమానికి Dr రోహిణమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా ఆంధ్ర మహిళా మండలి కార్యదర్శి విష్ణు వందన ,ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు Dr తనూజ కార్యదర్శి అనితా సభ్యులు స్నేహాలత, లక్ష్మీ ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్,కోడిపర్తి శ్రీధర్ ,పల్లం వెంకటేశ్వర్లు, మెదురు శ్రీనివాసఆచారి పాల్గొన్నారు

పోలియో వలన కాళ్లు పోగొట్టుకున్న ఒక విభిన్న ప్రతిభావంతుని ఆవేదన: మల్లు సుబ్బనరసారెడ్డి 

MF4TV: అతని మాటలో…. నేను అనగా చిన్నప్పుడే పోలియో సోకినటువంటి ఒక వికలాంగుడును నేను. పుట్టుకతో చాలా సాధారణమైనటువంటి వ్యక్తిగానే జన్మించాను కానీ విధి వైపరీత్యం వలన అప్పట్లో ఉన్నటువంటి పోలియో మహమ్మారి బారిన పడి నా చిన్నతనంలోనే నేను నా నడకను కోల్పోవడం జరిగింది నేను ఆనాటి నుండి నేటి వరకు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటూనే ఉన్నాను అనగా అమ్మఒడి చేరడానికి పరీక్ష ఎదుర్కొన్నాను అలాగే బడిలో పాఠాలు నేర్చుకోవడానికి ఎంతో శ్రమపడి ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ఎంతో కష్టపడి బడికి వెళ్లి పాఠాలు నేర్చుకున్నాను. మా ఊరు నుండి హైస్కూల్ కి వెళ్లడానికి రెండు కిలోమీటర్లు మేర ట్రై సైకిల్ కూడా లేని దు:స్థితిలో ఎంతో శ్రమతో వెళ్లి చదువుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో పోలియో వ్యాధిగ్రస్తుడైన నేను నా నడకను పోగొట్టుకున్నటువంటి తరుణంలో ఎన్నో ఇబ్బందులు పడి హైస్కూల్,కాలేజి చదవును కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత M.A.,B.Edను ఆ విధంగానే యుద్ధాన్ని చేసి మరి చదువుకున్నాను. అటువంటి తరుణంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి మాకు ఈ ప్రభుత్వం ప్రభుత్వాల వలన మాకు రోష్టర్ పాయింట్ విధానం వలన శారీరకంగా ఇబ్బందులకు ఎదుర్కొని శారీరకంగా ఎన్నో శ్రమలకి ఓర్చి చదువుకున్నటువంటి మాకు 56వ రోస్టర్ వలన అన్యాయం జరుగుతుంది. దీనికి తోడు కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి లేదా నిర్లక్ష్యంగా రోడ్లమీద రోడ్డు దాటుతూ యాక్సిడెంట్లకు గురియై వారి యొక్క సొంత తప్పిదం వలన చేసినటువంటి పనులు వలన వికలాంగులుగా మారుతున్నటువంటి వారి వలన పుట్టుకతో పోలియోతో వైకల్యం సంభవించినటువంటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది వాస్తవమా కాదా ఒక్కసారి వికలాంగ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ ప్రభుత్వాలు పోలియోను నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్తున్నాయి కానీ పోలియో వలన బాధితులుగా ఉన్నటువంటి వికలాంగులకు ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించాము అన్నటువంటి విషయాలను గాలికి వదిలేస్తున్నాయి వికలాంగులు అంటే కేవలం పింఛనుదారులేనా ఈ పింఛను కూడా పోలియో వ్యాధిగ్రస్తులకు ఒకలాగా మరియు నిర్లక్ష్యంగా వారి యొక్క శారీరక భాగాలను పోగొట్టుకున్నటువంటి వారికి మరోలాగా ఇచ్చినట్లయితే చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటినుంచి నేటి వరకు వికలాంగుడుగా ఉన్నటువంటి వాళ్లకి ఒక ఆదర్శంగా ఉంటుంది. అలా కాకుండా శాతాన్ని పట్టించి వికలాంగత్వాన్ని నిర్ణయించడం అనేది దౌర్భాగ్యకరమైనటువంటి అంశం ఎందుకనగా పోలియో వ్యాధిగ్రస్తుడు అనేవాడు చిన్నప్పుడే తన యొక్క శరీర అవయవాలను కోల్పోయి జీవితంలో బతకడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు . ఈ యాక్సిడెంట్ల వలన వారి యొక్క సొంత తప్పిదాల వలన అవయవాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే వున్నారో వారు యొక్క అవగాహన రాహిత్యము వలన వికలాంగులను ఎవరైతే పోలియో వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారిని అవమానకరంగా మాట్లాడటం వారి యొక్క రిజర్వేషన్లను తీసుకోవడానికి పోటీ పడడం లాంటిది చాలానే చూస్తూనే ఉన్నాం. మనం ఈ సమయంలో 56 రోష్టరు పాయింట్ మారడము అలాగే ఎవరైతే పోలియో వ్యాధిగ్రస్తులైనటువంటి శారీర వికలాంగులు ఉన్నారు వారికి ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత అనేది చాలా అవసరం. ఇది శారీరక వికలాంగుడిని అయినటువంటి నా యొక్క ఆవేదన మాత్రమే దయచేసి నా తోటి శారీరక వికలాంగులు అయినటువంటి వికలాంగులు నా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని నా యొక్క ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.

ఆదివారం అన్నదానం

MF4TV: మొహమ్మద్ ఫకృద్దీన్ చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో 30 మంది కి భోజనం నీళ్ళ పొట్లాలను నిరుపేద నిరాశ్రయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు సర్తాజుద్దీన్,కోశాధికారి అమృద్దీన్ సంస్థ ప్రతినిధిలు తదితరులు పాలుగోన్నారు.

వారం వారం అన్నదానం… పునఃప్రారంభం

MF4TV: మా MF చారిటబుల్ ట్రస్ట్” ద్వారా ప్రతి వారం అన్నదానం అనే కార్యక్రమాన్ని 168 వారాలపాటు దాదాపు మూడు సంవత్సరాల రెండు నెలల పాటు నిర్విరామంగా చేస్తూవచ్చాము… దానితరువాత మా ట్రస్ట్ ద్వారా వేరే కార్యక్రమాలకు సమయాన్ని కేటాయిస్తూ మా వారం వారం అన్నదానం అనే కార్యక్రమనికి కొంత విరామం ఇచ్చాము… నేటితో మళ్ళీ “వారం వారం అన్నదానం” అనే కార్యక్రమన్ని పునఃప్రారంభిస్తున్నందుకు మీడియా ముఖంగా తెలియచేయడానికి సంతోషిస్తున్నాము అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఈ వారం 30 మంది నిరుపేద నిరాశ్రయులకు భోజనం మంచినీళ్లు పంపిణి చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు సర్తాజుద్దీన్,కోశాధికారి అమృద్దీన్ సంస్థ ప్రతినిధిలు తదితరులు పాలుగోన్నారు  

రాష్ట్ర అధికార ప్రతినిధిగా మగ్దూమ్ 

MF4TV: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కు నిస్వార్ధ సేవలందిస్తున్న మగ్దూమ్ మొహిద్దీన్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమించడం జరిగింది ఈ సందర్భంగా మగ్దూమ్ మాట్లాడుతూ నాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు జగనన్న కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ భాయ్ గారికి నియోజకవర్గ సమన్వయ కర్త మేరిగ మురళీధర్ గారికి వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ వి.ఖాదర్ బాషా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పార్టీ బలోపేతం కోసం ఇంకా ఎక్కువగా కృషి చేస్తానని తెలిపారు.

మైనారిటీలు 90 శాతం వైసీపీ వైపే:వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండి. మగ్ధూమ్ మొహిద్దీన్

సీఎం జగన్ ముస్లింల పక్షపాతి ఏడు అసెంబ్లీ స్థానాలు మైనారిటీలకు మళ్లీ జగనన్నను సీఎం చేస్తాం మైనారిటీలు 90 శాతం వైసీపీ వైపే వైసీపీ మైనారిటీ సెల్ నాయకుల వెల్లడి MF4TV గూడూరు : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని మరోసారి రుజువైందని వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండి. మగ్ధూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాలలో ముస్లింలకు వైసీపీ అభ్యర్థులుగా అవకాశం కల్పించడం శుభ పరిణామమన్నారు. రాష్ట్రంలోని మైనారిటీలు 90 శాతం వైసీపీ వెంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామన్నారు. అలాగే గూడూరు నియోజకవర్గంలోనూ అత్యధిక మెజారిటీతో మేరిగ మురళీధర్ ను గెలిపించుకుంటామన్నారు. వైసీపీ నాయకులు షేక్. కాలేషా, జీ. జలీల్ లు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా భావించి అన్ని వర్గాల ప్రజలకు సంక్షే ఫలాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు సిటీ అభ్యర్థిగా మహమ్మద్ ఖలీల్ అహ్మద్ కు కేటాయించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో మైనారిటీలకు కేటాయించిన ఏడు స్థానాలలోనూ భారీ మెజారిటీతో వైసీపీ గెలవనుందని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మగ్ధూమ్,అల్తాఫ్, కాలేషా, జలీల్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు

నిత్య పెళ్లి కొడుకు చేతిలో మోసపోయిన బాధితురాలు

MF4TV: నెల్లూరు జర్నలిస్ట్ భవన్ లో నిత్య పెళ్లి కొడుకు చేతిలో మోసపోయిన బాధితురాలు మీడియా సమావేశం నెల్లూరు జిల్లా ప్ర‌భుత్వ ప్ర‌ధాన వైద్య‌శాల‌లో ప‌ని చేసే ష‌బీర్ అహ్మ‌ద్ త‌న‌ను మోసం చేశాడంటూ నెల్లూరు జర్నలిస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న‌కు పెళ్లైయి, భ‌ర్త చ‌నిపోయాడ‌ని, అయినా త‌న‌ను పెళ్లి చేసుకుని, త‌న‌కు సంబంధించిన న‌గ్న ఫోటోలు, వీడియోలు తీశాడ‌ని తెలిపింది. అయితే ష‌బీర్ అహ్మ‌ద్‌కి పెళ్ల‌య్యింద‌ని తెలిసి అత‌నిని దూరం పెట్టాన‌ని, అప్ప‌టి నుంచి తన న‌గ్న ఫోటోల‌తో బ్లాక్‌మొయిల్ చేస్తున్నాడ‌ని, కేవ‌లం త‌న‌తోనే కాకుండా మ‌రికొంత మంది అమ్మాయిల‌తో కూడా ఎఫైర్ పెట్టుకుని, వారిని కూడా వేధిస్తున్నాడ‌ని ఆమె తెలిపింది. దీనిపై తాను 6వ న‌గ‌ర పోలీస్ స్టేష‌న్‌కు ఫిర్యాదు చేశాన‌ని, అయితే అక్క‌డ సిఐ కేసు న‌మోదు చేయ‌కుండా, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిపింది. ఇప్ప‌టికైనా పోలీసులు నిత్య‌పెళ్లికొడుకు అయిన ష‌బీర్ అహ్మ‌ద్‌పై ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదు చేసి, న్యాయం చేయాల‌ని డిమాండ్ చేసింది

APని గంజాయి హబ్ గా మారుస్తూ యువతను నిర్వీర్యం చేయడమే కాక…

MF4TV గూడూరు:ఈ రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మారుస్తూ యువతను నిర్వీర్యం చేయడమే కాక ఎన్నికలకు నెల రోజుల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు టోకరా వేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని యువత గద్దె దించాలి యువతకు గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకుల పిలుపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టానం ఆదేశం మేరకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సూచనల ప్రకారం నేడు రాష్ట్రాన్ని గంజాయి కి నిలయంగా మారుస్తూ యువతను నిర్వీర్యం చేయడమే కాక ఎన్నికలకు నెల రోజుల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల ను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని యువత గద్దె దించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య మరియు తిరుపతి పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు.

సైకాలజిస్టులంటే ఎవరు? వారి పాత్ర ఏమిటి ?

MF4TV: ప్రజలకు అవగాహన నిమిత్తం: మానసిక ఆరోగ్యం, అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకాలజిస్టులంటే ఎవరు? వారి పాత్ర ఏమిటి ? సైకాలజిస్ట్ గురించి చట్టం ఏమి చెబుతోంది. గతంలో సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేయాలంటే పి.జి రెగ్యులర్ లేక డిస్టెన్స్ కోర్స్ పూర్తి చేసి ఉంటే చాలు. సైకాలజి డిపార్ట్మెంట్ లేని యూనివర్శిటీలు కూడా డిస్టెన్స్ కోర్సెస్ ఆఫర్ చేశాయి. దీంతో వందలమంది అర్హత లేని సైకాలజిస్ట్ లు పుట్టుకొచ్చారు. దీనిని నియంత్రించాలని సైకాలజిస్ట్లకు కూడా రిజిస్ట్రేషన్ ను తీసుకొనిరావాలని, చాలా కాలంగా పోరాటం జరుగుతోంది. ఎట్టకేలకు 2021వ సం|| మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం “నేషనల్ హెల్త్ & అలైడ్ సైన్సెస్” బిల్లును ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం ఇకపై సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రెగ్యులర్మోడ్ లో 3600 గంటలు చదివి ఉండాలని E & J క్లాసెస్ లో స్పష్టంగా పొందుపరిచియున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే రూ.50,000/-ల నుండి రూ.1,00,000/-లు వరకు జరిమానా లేదా 6 నెలల నుండి ఒక ఏడాది పాటు జైలు శిక్ష లేదా రెండు విధించవచ్చని చాప్టర్ 7 లో స్పష్టంగా హెచ్చరించింది. సైకాలజిస్ట్ లు ఏ మానసిక సమస్యకైనా ప్రాథమికంగా నిర్ధారణ చేసి, కౌన్సిలింగ్, అసెస్మెంట్ లు మొదటిగా పరీక్షించి, అవసరమైన యెడల మిగిలిన ప్రొఫెషనల్స్కి రెఫర్ చేస్తారు. ఉదాహరణకు : తీవ్ర ఆందోళనలు, భయాలు, దిగులు, అడిక్షన్, ఇతరత్రా మానసిక సమస్యలు. మోటివేషన్ స్పీకర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, లైఫ్ కోచ్ లకు భిన్నంగా వీరు కౌన్సిలింగ్ మరియు థెరఫి సెషన్లు నిర్వహిస్తారు. అలాగే సైకలాజికల్ అసెస్మెంట్స్, క్లినికల్ కేసులు, M.A/M.S.C., జనరల్/ క్లినికల్ కోర్సులు రెగ్యులర్గా పూర్తి చేసినటువంటి వారు మాత్రమే అర్హులు. కౌన్సిలింగ్లో జనరల్, ఇన్ఫార్మల్ మరియు ఫార్మల్ కౌన్సిలర్స్/ థెరపిస్ట్లు అనే వివిధ రకాల అర్హత కలిగిన వారు వుంటారు. అర్హత, అనుభవం కలిగిన వారు థెరపి నిర్వహిస్తారు. సైకియాట్రిస్ట్లు మందులు మాత్రమే సూచిస్తారు. క్లినికల్ కేసులకి “రీహాబిలేటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” వారి లైసెన్స్ తప్పనిసరి. N.M.P. హిప్నాసిస్, ఆరా పవర్, బ్లాక్ మ్యాజిక్, రేఖి వంటి అశాస్త్రీయమైనటు వంటి చికిత్సా పద్ధతులు అనాదిగా ఆచరణలో వున్నాయి. చాలా మంది ప్రజలకి “సైకాలజిస్ట్ లకి, సైకియాట్రిస్ట్ లకి మరియు మోటివేషన్ స్పీకర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, లైఫ్ కోచ్” ల పట్ల అవగాహన లేని కారణంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మరియు జీవితంలో చాలా కోల్పోతూ, కొత్త సమస్యలను కొని తెచ్చుకొని బాధపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మేము సైకాలజిస్ట్ లము అని తెలిపినా గానీ, మీరు వారి వద్దకు వెళ్ళినా గానీ, వారి విద్యార్హతలు, అనుభవము, లైసెన్స్, ఏ సంస్థల నుండి వారు పట్టా పొంది వున్నారన్న విషయాలను తప్పకుండా పరిశీలించుకోగలరు.  

మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి యోగ విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డ్

MF4TV: గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి యోగ విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించినట్లు వసంత యోగ అకాడమీ నిర్వాహకురాలు వసంతలక్ష్మి మీడియాకు తెలిపారు.తెలంగాణ  రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన వసంత యోగ అకాడమీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ నెలలో ఆన్లైన్లో నిర్వహించిన యోగా పోటీలలో గూడూరు పట్టణానికి చెందిన సంధ్యారాణి సూర్య నమస్కారాలు విభాగంలో నోబెల్  రికార్డు స్థాపించారని తెలిపారు . సంధ్యారాణి సూర్య నమస్కారాలు నాన్ స్టాప్ గా 108 సార్లు అతి తక్కువ సమయంలో చేయడంతో ఆమె నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించినట్లు న్యూఢిల్లీకి చెందిన ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారని తెలిపారు .  యోగ మన భారతదేశ సంపద అని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన సంధ్యారాణి మీడియాకు తెలిపారు . ఆన్లైన్లో నిర్వహించిన యోగా పోటీలలో నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన సంధ్యారాణి ఆదివారం గూడూరు పట్టణంలోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు యోగ అలవాటు చేసుకోవాలని అభిలాషించారు . యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతత పొందడంతో పాటు ఆరోగ్యవంతంగా ఉంటామని పేర్కొన

ఆన్‌లైన్ సంచలనం, సోషల్ మీడియా స్టార్ పూనమ్ పండే కన్నుమూత

MF4TV: ఆన్‌లైన్ సంచలనం, సోషల్ మీడియా స్టార్ పూనమ్ పాండే ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 32. ఈ రోజు ఉదయం పూనమ్ పాండే 32 ఏళ్ల వయస్సులో గర్భాశయ క్యాన్సర్‌తో మరణించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. పూనమ్ పాండే సోషల్ మీడియా ఖాతాలో.. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మరణించారాని ఆమె మేనేజర్ పేర్కొన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ప్రకటన ఇలా ఉంది, “ఈ ఉదయం మాకు కఠినమైనది. మా ప్రియమైన పూనమ్‌ను గర్భాశయ క్యాన్సర్‌తో కోల్పోయామని మీకు తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాం .   View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal)

SIRIDHANYALU (Millets) – English

DisclaimerNote: Our “MF4TV” website is purely for information purpose. This is to facilitate the viewers all the information regarding Dr. Khader Sir’s natural healthy lifestyle with millets. This has no personal connection with Dr. Khader Sir. గమనిక: మా “MF4TV” వెబ్‌సైట్ పూర్తిగా సమాచార ప్రయోజనం కోసం. ఇది డాక్టర్ ఖాదర్ సర్ యొక్క సహజ ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని వీక్షకులకు సులభతరం చేయడం కోసం మాత్రమే . దీనికి డాక్టర్ ఖాదర్ సర్‌తో వ్యక్తిగత సంబంధం లేదు.

అమృతాహారం

DisclaimerNote: Our “MF4TV” website is purely for information purpose. This is to facilitate the viewers all the information regarding Dr. Khader Sir’s natural healthy lifestyle with millets. This has no personal connection with Dr. Khader Sir. గమనిక: మా “MF4TV” వెబ్‌సైట్ పూర్తిగా సమాచార ప్రయోజనం కోసం. ఇది డాక్టర్ ఖాదర్ సర్ యొక్క సహజ ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని వీక్షకులకు సులభతరం చేయడం కోసం మాత్రమే . దీనికి డాక్టర్ ఖాదర్ సర్‌తో వ్యక్తిగత సంబంధం లేదు.

సిరిధాన్యాలు-చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

DisclaimerNote: Our “MF4TV” website is purely for information purpose. This is to facilitate the viewers all the information regarding Dr. Khader Sir’s natural healthy lifestyle with millets. This has no personal connection with Dr. Khader Sir. గమనిక: మా “MF4TV” వెబ్‌సైట్ పూర్తిగా సమాచార ప్రయోజనం కోసం. ఇది డాక్టర్ ఖాదర్ సర్ యొక్క సహజ ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని వీక్షకులకు సులభతరం చేయడం కోసం మాత్రమే . దీనికి డాక్టర్ ఖాదర్ సర్‌తో వ్యక్తిగత సంబంధం లేదు.

చిరుధాన్యాలతో వంటకాలు

“MF4TV” Disclaimer——————————-The information provided in this article is for general informational purposes only. While we strive to keep the information accurate and up-to-date, we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, reliability, suitability, or availability with respect to the article or the information, products, services, or related graphics contained in the article for any purpose. Any reliance you place on such information is therefore strictly at your own risk. In no event will we be liable for any loss or damage including without limitation, indirect or consequential loss or damage, or any loss or damage whatsoever arising from loss of data or profits arising out of, or in connection with, the use of this article. Always seek the advice of a qualified professional for any questions you may have regarding a medical condition or other subject matter.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ జాహ్నవి కపూర్

MF4TV: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అతిలోకసుందరి శ్రీదేవి కూతురు హీరోయిన్ జాహ్నవి కపూర్ OTTలోకి డెవిల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Salaar సినిమా లో ప్రభాస్ డైలాగులు మూడు నిమిషాలేనా…?

MF4TV: ప్రభాస్ సంభాషణలు సలార్ లో చాలా తక్కువగా ఉన్న మాట వాస్తవమే కానీ ఎంత లెన్త్ అనేది క్లారిటీ లేదు. అభిమానులు కొందరు మొత్తం సినిమాలో తమ డార్లింగ్ మాట్లాడిన డైలాగులన్నీ ఒక చోట చేర్చి దాన్నో వీడియో క్లిప్ గా మార్చి షేర్ చేయడం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో “సలార్” సెన్సేషన్! ఆ వీడియో క్లిప్ మీద మీరు ఓ లుక్ వెయ్యండి…

కనుమూరు హరిచంద్రారెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం: MLA వరప్రసాద్ రావు

MF4TV గూడూరు : కనుమూరు హరిచంద్రారెడ్డి సేవలు స్ఫూర్తిదాయకమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు అన్నారు. శనివారం గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లూరు ఆదిశేషారెడ్డి స్మారక మాస్టర్ క్రికెట్ లీగ్ 2024 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే, డీఎస్పీ విచ్చేశారు. భోగి సంబరాల్లో డ్యాన్స్ చేసిన మంత్రి అంబటి… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడా, సేవా, అధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలలో కనుమూరు హరిచంద్రారెడ్డి నిస్వార్థ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. పదహారేళ్లుగా వెటరన్ పోటీలను గూడూరులో సొంత నిధులతో నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. గూడూరు పట్టణం ముంపుకు గురికాకుండా ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జాతీయ రహదారిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి 150 కోట్లు మంజూరు చేయించామని గుర్తుచేశారు. మరుగుదొడ్ల ఆవశ్యకతను గుర్తించి పట్టణంలో అధునాతన టాయిలెట్లను నిర్మించామన్నారు. రెండో పట్టణం వైపు రైల్వే టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. స్టేడియంలో మహిళల కోసం యోగా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. డీఎస్పీ ఎం. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు క్రీడలకు పుట్టినిల్లు అన్నారు. హరిచంద్రారెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని హర్షణీయన్నారు. పండుగకు ముందే స్టేడియంలో క్రీడాకారులతో పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. కనుమూరు హరిచంద్రారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కనుమూరు హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇద్దరు స్నేహితుల ఆలోచనతో ప్రారంభైన మాస్టర్ లీగ్ పోటీలు గత పదహారేళ్లుగా ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్నామన్నారు. OTTలోకి డెవిల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..? స్టేడియంలో క్రికెట్ ఈశాన్యం వైపున అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 80 యార్డ్స్ ఉండేందుకు స్థలం కేటాయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావుకు గూడూరు పట్టణ క్రీడాకారులు, క్రీడాభిమానుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సొంతపేరు కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయాలని యువతకు పిలుపునిచ్చారు. 15ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఈ పోటీల నిర్వహిస్తుండం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలను ఆదరిస్తున్న పట్టణ ప్రజలకు, స్టేడియంను క్రీడలను అనుగుణంగా తయారు చేసిన క్రీడాకారులకు మాస్టర్ లీగ్ క్రీడాకారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్రికెట్ పోటీలను అతిధుల చేతులమీదుగా ప్రారంభించారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, టీ. నాగేశ్వరరావు, ఆరుజట్ల కెప్టెన్లు, వెటరన్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

OTTలోకి డెవిల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

MF4TV: కళ్యాణ్ రామ్ తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది చివరిలో విడుదలైంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించి, తెరకెక్కించాడు. సీత, అజయ్, సత్య, ఎస్తేర్, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు. డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా ఆకట్టుకున్నాడు. అయితే రివ్యూస్ పరంగా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 45 కోట్లు రూపాయలను ఖర్చు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ నామా వెల్లడించిన సంగతి విదితమే. అయితే… నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మూవీ ‘డెవిల్’…నుంచి కీలక అప్డేట్‌ వచ్చేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డెవిల్ గతేడాది డిసెంబర్ 29న రిలీజ్ అవగా బాక్సఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న అర్ధరాత్రి నుంచి డెవిల్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

MF4TV: దొరవారిసత్రం మండలం పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని దోరవారిసత్రం యస్ ఐ తిరుమలరావు హెచ్చరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలు, జూదం నిర్వహణ, ఇతర అసాంఘిక కార్యక్రమాలు నేరమన్నారు. ఈ ఉత్తర్వులను ఎవరైనా అధిగమిస్తే చట్టప్రకారం శిక్ష తప్పదన్నారు. ఎక్కడైనా కోడి పందేలు,జూదం,నాటుసారా కాయడం అమ్మడం, దొంగతనాలు లాంటి చట్ట విరుద్దమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిస్తే ఆ సమాచారాన్ని క్రింది నెంబర్లకు ఫోన్ చేసి తెలియచేయాలన్నారు.. 94407 96359,94407 96356 భోగి సంబరాల్లో డ్యాన్స్ చేసిన మంత్రి అంబటి…

భోగి సంబరాల్లో డ్యాన్స్ చేసిన మంత్రి అంబటి…

MF4TV:ఇవాళ భోగి పండుగ సందర్భంగా వాడవాడలా ప్రజలు భోగి మంటలు వేసుకుంటూ నృత్యాలు చేస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ నిర్వహించారు.

వేదయపాలెం లో వెలసియున్న హజరత్ సయ్యద్ ముషరఫ్ అలీ షా చిష్టి ఉల్ ఖాదరి వారి నిషాన్ కార్యక్రమం…

MF4TV నెల్లూరు: వేదయపాలెం మినీ బైపాస్ రోడ్ వద్ద వెలసియున్న హజరత్ సయ్యద్ ముషరఫ్ అలీ షా చిష్టి ఉల్ ఖాదరి వురూఫ్ అహ్మద్ షరీఫ్ మహనీయుని 14 వ గంధమహోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా నిషాన్ కార్యక్రమాన్ని ఖలీఫాలు మురీదులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. ముందుగా నిషాన్ ను ఊరేగించి దర్గా వద్దకు చేర్చి ప్రత్యేక ప్రార్థనల అనంతరం జండా ను ఎగురవేశారు, తదుపరి దర్గా పీఠాధిపతి ఖదీర్ అలీషా చిష్టి మరియు వారి బృందం భక్తి గీతాలాపన చేసి ఆనందపరిచారు అనంతరం దర్గా ఆవరణంలో మొబీన ఖాదర్ బాషా ల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. 62 మంది ఎమ్మెల్యే స్థానాలు పై క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఈ కార్యక్రమంలో ఖలీఫాలు ఖదీర్ అలీ షా చిష్టి, మగ్ధూమ్ అలీ షా చిష్టి ఉల్ ఖాదరి, ఖమర్ అలీ షా చిష్టి ఉల్ ఖాదరి, ఎజాజ్ చిష్టి,బాబు చిష్టి, జావీద్, ఆరిఫ్, ఇస్మాయిల్, నజీర్ చిష్టి, మస్తాన్, రియాజ్, యూనుస్, ఖలీల్,సాబీర్ తదితరులు పాల్గొన్నారు.

బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ నిర్వహించారు.

MF4TV: వెంకటాచలం మండలం తాతిపర్తిపాలెం పంచాయతీలో సోమిరెడ్డి పర్యటన ఈ సందర్భంగా మండలంలోని తాతిపర్తిపాలెం పంచాయతీలో బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ నిర్వహించారు. 62 మంది ఎమ్మెల్యే స్థానాలు పై క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఈ సంధర్భంగా గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినీ మ్యానిఫెస్టోలో భాగంగా బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కుంభకోణాలు జరుగుతున్నాయని సంపాదనే ధ్యేయంగా మంత్రి కాకాని దోచుకుంటున్నాడని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కుంభకోణాలకు కేరాఫ్ మంత్రి కాకాని అని.. నియోజకవర్గాన్ని దోచుకోవటంలో అడ్డే లేకుండా పోయిందని మాజీమంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశం అనంతరం మీడియా సమావేశం : Chandrababu Naidu & PawanKalyan రాష్ట్రంలోనే కుంభకోణాల మంత్రిగా కాకాణి పేరుపడ్డాడని, ఎద్దేవా చేశాడు. తుఫాన్ వల్ల నష్టపోయిన వారిలో తమ అనుకూలమైన వారికి 2500 ఇచ్చారని, అదే తెదేపా ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంభానికి కులాలకు అతీతంగా నాలుగు వేల రూపాయలు నగదు,20 కేజీల బియ్యం పంపిణీ చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మీ సురేంద్ర, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రావూరి రాధా కృష్ణమ నాయుడు, తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కుంకాల నాగేంద్ర ప్రసాద్, మావిల్లపళ్లి శ్రీనివాసులు నాయుడు, కోదండ రామానాయుడు ,మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్,నిక్కుదల రత్నయ్య, యనమల క్రిష్ణయ్య,ఆకుల రమణయ్య,నిక్కుదల రమేష్, సురేంద్ర, జంగం రమణయ్య, క్లస్టర్, యూనిట్,బూత్ ఇంచార్జీ లు, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే మరణించారు… Disclaimer:——————Google,ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. MF4TV సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు.సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాల MF4TV అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే MF4TV దీనికి ఎటువంటి బాధ్యత వహించదు

62 మంది ఎమ్మెల్యే స్థానాలు పై క్లారిటీ రావాల్సిన పరిస్థితి

MF4TV:2024 ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే 113 మంది వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థులు పేర్లు 62 మంది ఎమ్మెల్యే స్థానాలు పై క్లారిటీ రావాల్సిన పరిస్థితి 2024 ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే 113 మంది వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థులు పేర్లు 62 మంది ఎమ్మెల్యే స్థానాలు పై క్లారిటీ రావాల్సిన పరిస్థితి 1) ఇచ్ఛాపురం – పిరియ విజయ సాయిరాజ్2)పలాస – సిదిరి అప్పలరాజు3)టెక్కలి – దువ్వాడ వాణి4)శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు5)ఆమదాలవలస – తమ్మినేని సీతారాం6)నరసన్నపేట – ధర్మాన కృష్ణం దాస్7)రాజం (SC) – తలే రాజేష్8)పాలకొండ (ST) – విస్వసరాయ్ కళావతి9)కురుపాం (ST) – పాముల పుష్ప శ్రీవాణి10) పార్వతీపురం (SC) – అలజంగి జోగారావు11) సాలూరు (ST) – పీడిక రాజన్న దొర12) చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ13) గజపతినగరం – బొత్స అప్పలనారసయ్య14) నెల్లిమర్ల – బడ్డుకొండ అప్పలనాయుడు15) విజయనగరం – కొలగొట్ల వీరభద్రస్వామి16) భీమిలి – అవంతి శ్రీనివాస్ రావు17) విశాఖ ఈస్ట్ – ఎంవీవీ సత్యనారాయణ18) విశాఖ నార్త్ – కమ్మిల కన్నపరజు (K.K.Raju)19) విశాఖ వెస్ట్ – ఆడారి ఆనంద్ కుమార్20) విశాఖ సౌత్ – వాసుపల్లి గణేష్ కుమార్21) గాజువాక – వరుకుతి రామచంద్రరావు22) పెందుర్తి – గుడివాడ అమర్నాథ్23)అనకాపల్లి – మాలసల భారత్ కుమార్24) చోడవరం – కరణం ధర్మ శ్రీ25) మాడుగుల – బుడి ముత్యాల నాయుడు26) ఆరుకు(ST) – గొడ్డేటి మాధవి27) పాడేరు(ST)- మత్స్యరాస విశ్వేశ్వర రాజు28) నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్ గణేష్29) పాయకరావుపేట (SC) – కంబాల జోగులు30) తుని – దాడిసెట్టి రాజ31) రాజమండ్రి సిటీ – మర్గని భారత్32) రాజమండ్రి రూరల్ – *చెల్లుబోయిన వేణుగోపాల్*33) రాజోలు – *రాపాక వరప్రసాద్ రావు*34) P.గన్నవరం – *విప్పర్తి వేణుగోపాల్*35) కాకినాడ సిటీ – *ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి*36) మండపేట – *తోట తిరుముర్తులు*37) పిఠాపురం – *వంగ గీత విశ్వనాథ్*38) రామచంద్రాపురం – *పిల్లి సూర్యప్రకాష్*39) జగ్గంపేట – *తోట నరసింహం*40) పెద్దాపురం – *దవులురి దొరబాబు*41) ప్రత్తిపాడు – *వరుపుల సుబ్బారావు*42) రాజానగరం – *జక్కంపూడి రాజ*43) రంపచోడవరం (SC) – *నాగులపల్లి ధనలక్ష్మి*44) కొవ్వూరు (SC) – *తనేటి వనిత*45) భీమవరం – *గ్రంధి శ్రీనివాస్*46) తనుకు – *కరుమురి నాగేశ్వర్ రావు*47) తాడేపల్లిగూడెం – *కొట్టు సత్యనారాయణ*48) దెందులూరు – *కొఠారి అబ్బయ చౌదరీ*49) పోలవరం – *తెల్లం రాజ్యలక్ష్మి*50) నూజివీడు – *మేక వెంకట ప్రతాప్ అప్పారావు*51) గన్నవరం – *వల్లభనేని వంశీ*52) గుడివాడ – *కోడలి నాని*53) కైకలూరు – *దులం నాగేశ్వర రావు*54) పెడన – *ఉప్పాల రాము*55) మచిలీపట్నం – *పేర్ని కృష్ణ మూర్తి(కిట్టు)*56) పెనమలూరు – *జోగి రమేష్*57) విజయవాడ సెంట్రల్ – *వెలంపల్లి శ్రీనివాసరావు*58) విజయవాడ వెస్ట్ – *షేక్ అసిఫ్*59) విజయవాడ ఈస్ట్ – *దేవినేని అవినాష్*60) జగ్గయ్యపేట – *ఉదయ్ భాను సామినేని*61) తాడికొండ(SC) – *మేకతోటి సుచరిత*62) మంగళగిరి – *గంజి చిరంజీవి*63) వేమూరు(SC) – *వరికుటి అశోక్ బాబు*64) రేపల్లె – *ఈవురి గణేష్*65) ప్రత్తిపాడు(SC) – *బాలసాని కిరణ్ కుమార్*66) గుంటూరు వెస్ట్ – *విడుదల రజినీ*67) గుంటూరు ఈస్ట్ – *షేక్ నూరి ఫాతిమా*68) చిలకలూరిపేట – *మల్లెల రాజేష్ నాయుడు69) సత్తెనపల్లి – *అంబటి రాంబాబు70) వినుకొండ – *బొల్ల బ్రహ్మనాయుడు71) గురజాల – *కాసు మహేష్ రెడ్డి72) మాచెర్ల – *పిన్నెలి రామకృష్ణ రెడ్డి73) యర్రగొండపాలెం – *తటిపర్తి చంద్రశేఖర్74) దర్శి – *బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి75) అద్దంకి – పనెం హనిమి రెడ్డి76) సంతనూతలపాడు – మెరుగు నాగార్జున77) ఒంగోలు – బాలినేని శ్రీనివాస రెడ్డి78) కొండపి – అదిములపు సురేష్79) ఆత్మకూరు – మేకపాటి విక్రమ్ రెడ్డి80) కోవూరు – నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి81) నెల్లూరు సిటీ – అనిల్ కుమార్ యాదవ్82) సర్వేపల్లి – కాకాని గోవర్ధన్ రెడ్డి83) గూడూరు – మెరిగా మురళీధర్84) బద్వేల్ – దాసరి సుధ85) కడప – అంజద్ బాషా86) రాయచోటి – గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి87) పులివెందుల – YS జగన్ మోహన్ రెడ్డి88) ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి89) అల్లగడ్డ – గంగుల బిజ్జెందర్ రెడ్డి90) కర్నూల్ – హఫీజ్ ఖాన్91) పాన్యం – కాటసాని రాంభూపాల్ రెడ్డి92) నంద్యాల – శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి93) బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి94) దోన్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి95) ఎమ్మిగనూరు – మచని వెంకటేష్96) అలురు – చిప్పాగిరి విరూపాక్ష97) రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి98) అనంతపూర్ అర్బన్ – అనంత వెంకటరామరెడ్డి99) కళ్యాణదుర్గం – తలారి రంగయ్య100) రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి101) మడకశిర – శుభ కుమార్102) హిందూపూర్ – M.K.రూప103) పెనుకొండ – K.V.ఉష శ్రీ చరణ్104) ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరమి రెడ్డి105) కదిరి – B.S.మక్బూల్ అహ్మెద్106) పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి107) చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి108) తిరుపతి – భూమన అభినయ రెడ్డి109) శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూధన్ రెడ్డి110) నగరి – R.K.రోజా111)గంగాధర నెల్లూరు – K.నారాయణస్వామి112) చిత్తూరు – విజయానందా రెడ్డి113) కుప్పం – K.R.J.భారత్

వైసీపీ ఇంఛార్జిల మార్పులు చేర్పులకు సంబంధించి మూడో జాబితా విడుదల…

MF4TV: వైసీపీ ఇంఛార్జిల మార్పులు చేర్పులకు సంబంధించి మూడో జాబితా విడుదలైంది. 21మందితో(6 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు) థర్డ్ లిస్ట్ ప్రకటించింది వైసీపీ హైకమాండ్. ఇప్పటివరకు 38 స్థానాల్లో ఇంఛార్జిల మార్పులు చేశారు జగన్. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్. అయితే మొదటి జాబితాలో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించ లేదు. రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు. CM జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో : ఎంపీ కేశినేని నాని ఈసారి అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించారు. మొదటి రెండు లిస్టులతో పోలిస్తే మూడో జాబితాకు సంబంధించి సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. వివాదాస్పదమైన నియోజకవర్గాలు ఉండటంతో ఎక్కువ సమయం తీసుకున్నారని తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని ఫ్లవర్ షోను సందర్శించిన ప్రధాని మోదీ పార్లమెంటు ఇంఛార్జీలు: ♦️తిరుపతి .. కోనేటి ఆదిమూలం♦️కర్నూల్.. గుమ్మనూరు జయ రాం♦️ఏలూరు… కరుమూరి సునీల్ కుమార్శ్రీ♦️కాకుళం.. పెరాడ తిలక్..♦️విశాఖ.. బొత్స ఝాన్సీ అసెంబ్లీ ఇంఛార్జిలు.. ♦️ఇచ్ఛాపురం.. పిరియా విజయ♦️టెక్కలి.. దువ్వాడ శ్రీనివాస్చిం♦️తలపూడి.. విజయ రాజు♦️రాయదుర్గం.. మెట్టు గోవింద రెడ్డి♦️దర్శి.. భూచేపళ్లి శివ ప్రసాద్ రెడ్డి♦️పూతలపట్టు.. సునీల్ కుమార్చి♦️చిత్తూరు .. విజయానంద రెడ్డి♦️మదనపల్లి.. నిస్సర అహ్మద్రా♦️రాజంపేట .. అకేపాటి అమర్నాథ్ రెడ్డి♦️ఆలూరు.. విరూపాక్ష♦️కోడుమూరు.. డాక్టర్ సతీష్..♦️గూడూరు.. మేరుగ మురళి♦️సత్యవేడు.. గురుమూర్తి

CM జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో : ఎంపీ కేశినేని నాని

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ కేశినేని నాని అహ్మదాబాద్‌లోని ఫ్లవర్ షోను సందర్శించిన ప్రధాని మోదీ

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశం అనంతరం మీడియా సమావేశం : Chandrababu Naidu & PawanKalyan

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశం అనంతరం మీడియా సమావేశం  దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలుగకుండా అదే స్థలంలో దేవాలయాన్ని అభివృద్ధి చెస్తం:CM రేవంత్ రెడ్డి

దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలుగకుండా అదే స్థలంలో దేవాలయాన్ని అభివృద్ధి చెస్తం:CM రేవంత్ రెడ్డి

MF4TV: పరిగి నియోజకవర్గం దామగుండం దేవాలయం ప్రాంతంలో దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలుగకుండా అదే స్థలంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ, అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీ ప్రాజెక్టు ‘లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్’ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు.   నేవి కమండర్ శ్రీ కార్తిక్ శంకర్ బృందం, పరిగి ఎమ్మెల్యే శ్రీ రాంమోహన్ రెడ్డి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసారు. నేవి కమండర్ కార్తిక్ శంకర్ ‘లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్’ గురించి ముఖ్యమంత్రికి వివరించారు. నావికాదళానికి చెందిన భారీ పరికరాలను ఇక్కడ నిర్మిస్తారని, దీని ఏర్పాటు వల్ల పరిగి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే మరణించారు… ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నేవి కమాండర్ ముఖ్యమంత్రికి వివరించారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని నేవి అధికారులతో సమన్వయం చేసుకొని పనులు త్వరలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు.  ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష… ఈ కార్యక్రమంలో కల్నల్ హిమవంత్ రెడ్డి, నేవీ సిబ్బంది శ్రీ సందీప్ దాస్, శ్రీ రాజ్ బీర్ సింగ్, శ్రీ మణిశర్మ, శ్రీ మనోజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణాలో వెల్ స్పన్ Welspun World గ్రూప్ పెట్టుబడులు

హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు: CM రేవంత్ రెడ్డి ఆతిధ్యం

MF4TV: బుదవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే మరణించారు… ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలలో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు ముందుకు రావాలని కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష… ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ, శ్రీ శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, శ్రీ జయేష్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే మరణించారు…

MF4TV: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోండటం ఇక లాంఛనప్రాయమే అయింది. దేశ రాజధాని వేదికా కాంగ్రెస్ పార్టీలో చేరారామె. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష… అనంతరం ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్ననారు.   Ys sharmila మాట్లాడుతు: మార్కెట్లోకి మళ్లి బజాజ్ చేతక్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే మరణించారు.రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే రాజశేఖర్ రెడ్డి గారికి సంతోషం, గర్వం కలిగించే విషయం అని అన్నరు. తెలంగాణాలో వెల్ స్పన్ Welspun World గ్రూప్ పెట్టుబడులు  

ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష…

MF4TV: ములుగు జిల్లా : ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారవుతుంది. 2014 లోనే ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించటంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపారు. నేషనల్ కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినంలో ఉన్నాయి. ఆ కంపెని ఎండీ శ్రీ హార్దిక్ పటేల్‌, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈఓ శ్రీ వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి డా. బి. ఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు. తెలంగాణాలో వెల్ స్పన్ Welspun World గ్రూప్ పెట్టుబడులు మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్‌క్వెస్ట్ బృందాన్ని కోరారు. బిల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెని ఆసక్తి చూపుతోంది. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. బిల్ట్ మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది: CM Revanth Reddy సీఎంతో పాటు మంత్రులు అనసూయ గారు, శ్రీమతి కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లోకి మళ్లి బజాజ్ చేతక్ గత ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాండల్ trailer

మార్కెట్లోకి మళ్లి బజాజ్ చేతక్

MF4TV: మార్కెట్లోకి మళ్లి బజాజ్ Bajaj చేతక చిన్నప్పుడు బైక్ అంటే చేతక్ నే 1972 నుండి 2000 వ సంవత్సరం వరకు ఇండియన్ మార్కెట్ ని ఏలిన జజాజ్ చేతక్ బండి గుర్తుందా.. టీవీ ఛానెళ్ల ప్యాకేజీ ధరల పెంపు! రెండు దశాబ్దాల తరువాత కొత్తరూపు సంతరించుకుని మళ్ళీ 2024 లో మన ముందుకు రాబోతుంది.

తెలంగాణాలో వెల్ స్పన్ Welspun World గ్రూప్ పెట్టుబడులు

MF4TV తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వెల్‌స్పన్ గ్రూప్‌ ఛైర్మన్ శ్రీ బి. కె. గోయెంకా, సంస్థ ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం వెల్లడించారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది: CM Revanth Reddy వెల్‌స్పన్ గ్రూప్‌ చైర్మన్ శ్రీ బి. కె. గోయెంకా మాట్లాడుతూ, తమ కంపెనీ భవిష్యత్తులో చందన్‌వెల్లి పారిశ్రామిక వాడలో ప్రారంభించబడిన IT సేవలలో రూ. 250 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో ఐటి రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు, వికారాబాద్, అదిలాబాద్ జిల్లాల్లోని యువతకు IT ఉద్యోగాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు. టీవీ ఛానెళ్ల ప్యాకేజీ ధరల పెంపు! ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, సిఎం ఓఎస్డీ శ్రీ అజిత్ రెడ్డి, వెల్‌స్పన్ గ్రూప్‌ హెడ్ (కార్పొరేట్ వ్యవహారాలు) శ్రీ చింతన్ థాకర్, శ్రీ భార్గవ మొవ్వ తదితరులు పాల్గొన్నారు.

టీవీ ఛానెళ్ల ప్యాకేజీ ధరల పెంపు!

MF4TV: దేశంలోని ప్రముఖ బ్రాడ్కాస్టర్లు అయినటువంటి జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్, వయాకామ్ 18 సంస్థలు తమ ఛానెళ్ల ప్యాకేజీ ధరలను పెంచాయి. వయాకామ్ 18 తమ ప్యాకేజీల ధరలను 20-25శాతానికి పెంచగా.. జీ 9-10%, సోనీ 10-11% పెంచాయి.  త్వరలో డిస్నీ స్టార్ కూడా కొత్త ధరలను ప్రకటించనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని బ్రాడ్కాస్టర్లు పేర్కొన్నాయి. ఈ పెంపు టీవీ ఛానెల్ బిల్లులపై ప్రభావం చూపనుంది.

సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది: CM Revanth Reddy

MF4TV తెలంగాణ: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి నెల పూర్తయిన సందర్భంగా CM రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నేరుగా మీ కోసం: సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. కాంగ్రెస్‌లో విలీనం: వైఎస్‌ షర్మిల జనవరి 3న ఢిల్లీలో ఏఐసీసీ నాయకత్వాన్ని కలవనున్నారు పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా. మీ రేవంతన్న  అయలాన్ (తెలుగు) – Official ట్రైలర్: ఏలియన్ ఇండియాకు వస్తే…

మున్సిపల్ కార్మికుల సమ్మెకు యునైటెడ్ ఫోరం మద్దతు

MF4TV గూడూరు : గూడూరు పురపాలక సంఘ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్షలు శనివారంతో 12వ రోజుకు చేరుకున్నాయి. ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ యునైటెడ్ ఫోరం కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపింది. సమసమాజ స్థాపనకు మూలస్థంభాలు పాత్రికేయులు:యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర ఈ సందర్భంగా ఆ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రోజూ వేకువజామున లేచి మధ్యాహ్నం వరకూ పనిచేస్తే తప్ప పట్టణం పరిశుభ్రంగా మారదన్నారు. మనకోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోరికలు తీర్చాల్సిన కనీస జగన్ నీ నమ్ముకుంటే చెవిలో పువ్వు పెడతారని మున్సిపల్ కార్మికులు నిరసన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఐదు నెలలుగా కొంతమంది కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫోరం ఆధ్వర్యంలో కార్మికులకు సంఘీభావంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫోరం ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాకాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలందరూ ఇళ్లలో ఉంటే కాలువలలో పూడికతోపాటు పారిశుద్ధ్యం మెరుగుకు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారన్నారు. అటువంటి కార్మికులకు ఎంతచేసినా తక్కువేనన్నారు. అంతకుముందు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3కోట్ల 15లక్షలతో నూతనంగా నిర్మించిన ‘సామాజిక ఆరోగ్య కేంద్రాని ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ యమ్. నారాయణ్, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్టెళ్ల పెంచల్ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు గోపాల్, జిల్లా నాయకులు సాంబమ్మ, వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు గోపీనాధ్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.  

అయలాన్ (తెలుగు) – Official ట్రైలర్: ఏలియన్ ఇండియాకు వస్తే…

MF4TV: అయలాన్ (తెలుగు) – official ట్రైలర్ | శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా అయలాన్. ఏలియన్ ఇండియాకు వస్తే అనే కథాంశంతో కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ గా ఈ సినిమా రాబోతుంది. తమిళ్ లో సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కాబోతుంది. తెలుగు రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా చూసేయండి. తాండల్ trailer Story line: తమీజ్ ఒక గ్రహాంతర సందర్శకుడిని కలుస్తాడు మరియు అతని జీవితం తలక్రిందులుగా మారుతుంది, వారు రహస్యాలను వెలికితీసేందుకు, భూమిని రక్షించడానికి మరియు ఇంటికి తిరిగి వెళ్ళే మార్గాన్ని కనుగొనడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తారు… గుంటూరు కారం ‘Guntur Kaaram’ మూవీ స్టిల్స్, HD గ్యాలరీ

తాండల్ trailer

MF4TV: “తాండల్ ” చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. Sreeleela శ్రీలీల HD గ్యాలరీ నాగ్ యొక్క NSR టైటిల్ సాంగ్: వేడుకలు ప్రారంభం Story line: NC 23 చిత్రం యొక్క కథాంశం శ్రీకాకుళంలో మత్స్యకారుల నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది.

సమసమాజ స్థాపనకు మూలస్థంభాలు పాత్రికేయులు:యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర

MF4 TV: గూడూరు : సమ సమాజ స్థాపనకు మూలస్థంభాలు పాత్రికేయులేనని ఏస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర అన్నారు. శుక్రవారం పెద్ద మసీదు వీధిలోని యునైటెడ్ ఫోరం కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రెండు వేర్వేరు అసోసియేషన్లను ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామమన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ఫోరం తరపున సహకారం అందిస్తామన్నారు. అందరినీ ఒకే వేదికపై కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కోసం యూనియన్లను ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కత్తిపోటు కంటే కలం పోటు, స్టన్ గన్ కంటే పెన్ గన్ గొప్పవన్నారు. ఇచ్చిన మాట మేరకు ఫోరం తరపున 50వేలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంక్షేమ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. ఫోరం ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాకాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాత్రికేయులు కలిసికట్టుగా ముందుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన మంత్రి కాకాణి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్లకు రూ. 50వేలు విరాళం ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ఫోరం సహకారం ఉంటుంది చెడును బహిర్గతం చేసే పాత్రికేయులు మంచిని ప్రోత్సహించాలి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు 40 మందికి ఫోరం ఆధ్వర్యంలో ఘన సన్మానం 3కోట్ల 15లక్షలతో నూతనంగా నిర్మించిన ‘సామాజిక ఆరోగ్య కేంద్రాని ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ యమ్. నారాయణ్, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఫోరం బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు పొట్టేళ్ల పెంచలయ్య యాదవ్ మాట్లాడుతూ స్వతంత్రంగా ఎదగడం వేరు సమూహంగా ఎదగడం వేరన్నారు.సమూహంగా ఉంటే హక్కులు సాధించుకోగలమన్నారు. విలేకరులు సమాజంలో చోటుచేసుకునే అవినీతి అక్రమాలను ఎలా బయటపెడుతారో అలాగే నీతి నిజాయితీతో సమాజం కోసం పనిచేసే వారిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీలో ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్. జమాలుల్లా మాట్లాడుతూ ఫోరం ఏర్పడినప్పటినుండి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతోందన్నారు. చైతన్య యాత్రల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో రాజకీయ, సామాజిక చైతన్యం కోసం యునైటెడ్ ఫోరం చేసిన కృషి అభినందనీయమన్నారు. స్వార్థ రహిత సేవలు ప్రజల మనసులను ఆకట్టుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఫోరం సేవలను కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో “సలార్” సెన్సేషన్! ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు ఎం. ప్రభుదాస్ మాట్లాడుతూ వార్తలు, ప్రకటనలు సేకరించే క్రమంలో విలేకరులు నిత్యం పరుగులు తీస్తుంటారని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను సన్మానించేందుకు ముందుకొచ్చిన యునైటెడ్ ఫోరం సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను శాలువాలతో సన్మానించారు. మెమెంటోలతో పాటు 50వేల రూపాయల నగదును రెండు యూనియన్లకు ఫోరం జాతీయ అధ్యక్షులు చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు గూడూరు గోపాల్, సాంబమ్మ, వెంకటేశ్వర్లు,మణి, అయ్యప్ప, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు షేక్. జమాలుల్లా, శివ కుమార్, ఉడతా శరత్ యాదవ్, ప్రభుదాస్, పర్చూరు బాలకృష్ణ, సుబ్రమణ్యం, గుమ్మడి అనిల్ కుమార్, భవానీ ప్రసాద్, శశిధర్, యాక్ట్ శ్రీను, సలీం, మంగళపూరు శ్రీనివాసులు, కృపానిధి, పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.

జగన్ నీ నమ్ముకుంటే చెవిలో పువ్వు పెడతారని మున్సిపల్ కార్మికులు నిరసన

MF4TV: పుత్తూరులో ఏపీమున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం స్వతంత్ర సంఘాలు జేఏసీ పిలుపు మేరకు శుక్రవారము పుత్తూరు లో మున్సిపల్ కార్మికులు చెవిలో పువ్వు పెట్టుకొని అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన నిర్వహించారు   ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం 26 వేల రూపాయలు మంజూరు చేయాలని, సీయల్స్, క్యాజువల్ అమలు చేయని మున్సిపల్ కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని తదితర నినాదాలు చేశారు.  మున్సిపల్ కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలి లేకుంటే సమ్మెను ఉద్రిక్తం చేస్తాం .. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు డి మహేష్ ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెను ఉద్దేశించి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు డీ మహేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమ్మె చివరి ఆయుధమని, సమ్మెకు వెళ్ళుటకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని ప్రజలు అనారోగ్యానికి గురైతే దానికి బాధ్యత ప్రభుత్వం వహించవలసి వస్తుందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన మంత్రి కాకాణి మున్సిపల్ కార్మికుల 21 డిమాండ్స్ పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం స్వతంత్ర సంఘాల జేఏసీ కోరగా అందులో కేవలం డ్రైవర్స్ అండర్ గ్రౌండ్ వర్కర్స్ మలేరియా వర్కర్స్ కు మెడికల్ అలవెన్స్ వర్తింపజేస్తామని, పర్మినెంట్ చేయమని జీతాల పెంచమని ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరించడంతో తప్పనిసరిగా సమ్మెలకు వెళ్తున్నామని పారిశుద్ధ్య కార్మికుల చేస్తున్న సమ్మెకు ప్రజల సహకరించాలని ఆయన అన్నారు ఈ సమ్మెలో ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న వాటర్ వర్క్స్ లో పనిచేయువారు, పార్క్ సుబ్రపరిచేవారు వారికి జీతాలు పెంచాలని, సమ్మె డిమాండ్ సత్వరమే పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. జపాన్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.: జూనియర్ ఎన్టీఆర్ మున్సిపల్ పాశుద్ధ్య కార్మికుల శ్రమను ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందని ఇకనైనా ఆపి వారిని తక్షణమే పర్మిట్ చేయాలని ప్రభుత్వం పెంచుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26 వేల రూపాయలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆప్కాస్ కార్మికులకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆప్కాస్ లో ఉన్న పిఎఫ్ సమస్యలు స్థానికంగానే పరిష్కరించాలని మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి వర్తింప చేయాలని, సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించకుండా దొడ్డేదారిన పనులు చేయిస్తే సహించేది లేదని, ప్రజల ఆరోగ్యాలే మా క్షేమం అంటూ ప్రతినిత్యం దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించేలా ఈ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు స్పందించాలని అన్నారు. జనసేన పార్టీ నుండి గోపి రాయులు గారు మద్దతు తెలిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు ‘నా సామి రంగ’ Naa Saami Ranga మూవీ స్టిల్స్, HD గ్యాలరీ యూనియన్ ఏఐటీయూసీ , జిల్లా ఉపాధ్యక్షులు చంద్రబాబు, నాయకులు గోపి, కార్మికులు గణేష్ కుమార్, సుమన్ ,నాగ ,సుభాషిని, శరవణ, విజయ్ కుమార్, యాకోబు ,అంకయ్య, గోవింద్ స్వామి తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన మంత్రి కాకాణి

MF4TV:నెల్లూరు అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అపోలో హాస్పిటల్ వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి కాకాణి ఎన్నికల సన్నద్ధత, యాత్రపై చర్చించేందుకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు జనవరి 4న సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి సూచించిన మంత్రి కాకాణి.అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన మంత్రి కాకాణి 3కోట్ల 15లక్షలతో నూతనంగా నిర్మించిన ‘సామాజిక ఆరోగ్య కేంద్రాని ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ యమ్. నారాయణ్, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి   కోలుకోవాలని ఆకాంక్షించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి

3కోట్ల 15లక్షలతో నూతనంగా నిర్మించిన ‘సామాజిక ఆరోగ్య కేంద్రాని ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ యమ్. నారాయణ్, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,

MF4TV: కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నాబార్డ్ నిధులు రూ.3 కోట్ల 15 లక్షలతో నూతనంగా నిర్మించిన ‘సామాజిక ఆరోగ్య కేంద్రాని ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ యమ్. నారాయణ్ , కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి , నెల్లూరు జిల్లా DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు , బుచ్చి నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి  ఇంకా పలువురు మాట్లాడుతు: ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందులో- మేల్ వార్డ్, ఫిమేల్ వార్డ్, ఐసొలేషన్ వార్డ్, పీడియాట్రిక్ వార్డ్, ఆపరేషన్ థియేటర్, క్యాజువాలిటీ, ఈసీజీ, బ్లడ్ టెస్టింగ్ & స్టోరింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ 30 పడకల ఆసుపత్రిలో ప్రతి పేదవాడికి అన్ని హంగులతో ఇంకా మెరుగైన వైద్యం అందించబోతున్నాం అదేవిధంగా, ఇందుకూరుపేటలోని 30 పడకల ‘సామజిక ఆరోగ్య కేంద్రం’ లోనూ రూ.3కోట్ల 95లక్షలతో నూతన భవన నిర్మాణం చేయించి అందులో- లేబరు రూమ్, డెంటల్, X-ray, అల్ట్రాసోనిక్, ICTC ల్యాబ్, ఈసీజీ, మైనర్ OT వంటి సదుపాయాలతో ఆధునికరించి ఇంకా మెరుగైన వైద్యం అందించబోతున్నాం కాంగ్రెస్‌లో విలీనం: వైఎస్‌ షర్మిల జనవరి 3న ఢిల్లీలో ఏఐసీసీ నాయకత్వాన్ని కలవనున్నారు కోవూరులోని 50 పడకల ‘సామజిక ఆరోగ్య కేంద్రం’లో APVVP గ్రాంట్ రూ. 40లక్షలతో రిపైర్స్&మైంటెనస్ కింద సీసీ రోడ్, కాంపౌండ్ వాల్, పెయింటింగ్, సీలింగ్ ప్లాస్టరింగ్, లీకేజెస్, టాయిలెట్ డోర్స్ మొదలైన పనులతో మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్ది ప్రతి పేద, మధ్యతరగతి వాళ్లకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాం విడవలూరులో రూ. 50 లక్షలతో ‘న్యూ పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్’ నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి, త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం ఏపీలో ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు మైపాడులో రూ.1కోటి 54లక్షలతో ‘ప్రైమరీ హెల్త్ సెంటర్’ నిర్మాణానికి టెండర్లు పిలిపించాం త్వరలోనే పనులు ప్రారంభించి అనుకొన్నటైంకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం నియోకజకవర్గంలోని జొన్నవాడ, ఇనుమడుగు, యెల్లయపాలెం, కొడవలూరు, విడవలూరు,రామతీర్థం PHCలను రూ.2కోట్ల 9లక్షలతో ఆధునీకరించి పేదవాడి ప్రాధమిక వైద్యం అందుబాటులోకి తెస్తున్నం Sreeleela శ్రీలీల HD గ్యాలరీ

ఏపీలో ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

MF4TV: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారులు అన్ని స్కూల్స్ యాజమాన్యాలకు ఆదేశాలిస్తున్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జనవరి 19న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. కాగా, తెలంగాణలో ఈ నెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌లో విలీనం: వైఎస్‌ షర్మిల జనవరి 3న ఢిల్లీలో ఏఐసీసీ నాయకత్వాన్ని కలవనున్నారు

MF4TV: వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైయస్ షర్మిల బుధవారం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనాన్ని ఖరారు చేయనున్నట్లు మంగళవారం ఇక్కడి వర్గాలు తెలిపాయి. ఈరోజు తన పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించిన షర్మిల, తాను మరియు ఇతర నాయకులు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని కలుసుకుని రేపు ఢిల్లీలో “కీలకమైన” ప్రకటన చేస్తారని చెప్పారు. షర్మిల SHARMILA ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుమార్తె మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు. షర్మిలకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో పదవి ఇవ్వబడుతుందని, వైఎస్‌ఆర్‌టీపీని YSRTP కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పీటీఐకి తెలిపాయి. “ఒకట్రెండు రోజుల్లో అంతా తేలిపోతుంది.. ఓపిక పట్టండి’’ అని సమావేశం అనంతరం విలేకరులతో ప్రశ్నించగా ఆమె అన్నారు. తెలంగాణలోని ఆమె సహచరులను తగిన విధంగా ఉంచుతామని కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు హామీ ఇచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్నికల సన్నద్ధత, యాత్రపై చర్చించేందుకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు జనవరి 4న సమావేశం కానున్నారు. తెలంగాణలో TELANGANA ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కే చంద్రశేఖర్‌రావు KCR నేతృత్వంలోని బీఆర్‌ఎస్ BRS అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించేందుకు షర్మిల SHARMILA కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. కలిసి పనిచేయడం లేదా విలీనంపై కాంగ్రెస్ పార్టీతో తన చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఆమె గతంలో చెప్పారు. ఆమె గతేడాది దేశ రాజధానిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిశారు.

ఎన్నికల సన్నద్ధత, యాత్రపై చర్చించేందుకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు జనవరి 4న సమావేశం కానున్నారు.

MF4TV న్యూఢిల్లీ: కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలు మరియు రాబోయే భారత్ న్యాయ యాత్ర కోసం పార్టీ సన్నద్ధతపై చర్చించడానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ Congress అగ్రనేతలు జనవరి 4న సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఒకరోజు సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు మరియు జనవరి 14న ఇంఫాల్ నుండి ముంబై వరకు ప్రారంభమయ్యే భారత్ న్యాయ్ యాత్ర గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధతపై పార్టీ చీఫ్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ RAHUL GANDHI ఇప్పటికే రాష్ట్ర నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో విలీనం: వైఎస్‌ షర్మిల జనవరి 3న ఢిల్లీలో ఏఐసీసీ నాయకత్వాన్ని కలవనున్నారు సెప్టెంబర్ 2022 నుండి జనవరి 2023 మధ్య జరిగిన భారత్ జోడో యాత్ర యొక్క రెండవ సంస్కరణ అయిన భారత్ న్యాయ్ యాత్ర, లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలను చేరుకోవడానికి మరియు వారితో కనెక్ట్ కావడానికి పార్టీ చేసిన ప్రయత్నం.

జపాన్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.: జూనియర్ ఎన్టీఆర్

MF4TV: జపాన్(JAPAN) భూకంపం గురించి తెలుసుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక ట్వీట్‌లో, భూకంప సంఘటన సమయంలో తాను జపాన్‌లో ఉన్నానని మరియు ప్రభావితమైన వారు త్వరగా కోలుకోవాలని తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నాగ్ యొక్క NSR టైటిల్ సాంగ్: వేడుకలు ప్రారంభం Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected. Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵 — Jr NTR (@tarak9999) January 1, 2024 జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో, “నేను ఈ రోజు జపాన్ నుండి ఇంటికి తిరిగి వచ్చాను మరియు భూకంపం గురించి తెలిసి షాక్ అయ్యాను. ఒక వారం పాటు అక్కడే ఉన్నాను. ప్రతి ఒక్కరి శ్రేయస్సును కోరుకుంటున్నాను.ఈ విపత్తు నుండి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు.

నాగ్ యొక్క NSR టైటిల్ సాంగ్: వేడుకలు ప్రారంభం

MF4TV: కింగ్ నాగార్జున పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ నా సామి రంగ సంక్రాంతి రేసులో ఉంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నూతన దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి రోజున జనవరి 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని మేకర్స్ లాంచ్ చేయడంతో వేడుకలు మొదలయ్యాయి. MM కీరవాణి స్వరపరిచిన నా సామి రంగా పాట పూర్తి మసాలా బీట్‌లతో కూడిన డ్యాన్స్ నంబర్. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు మరియు వారు కథానాయకుడి లక్షణాలను వివరిస్తారు. జపాన్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.: జూనియర్ ఎన్టీఆర్ కాల భైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్ పాటకు అదనపు శక్తిని తీసుకువచ్చి, యానిమేషన్‌గా నంబర్‌ను వక్రీకరించారు. అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్‌లతో కలసి నాగార్జున కలర్‌ఫుల్ సంఖ్యలో కొన్ని అద్భుతమైన డ్యాన్స్ మూవ్‌లను ప్రదర్శిస్తున్నారు. నాగార్జున లుంగీలో మాస్ అవతార్‌లో కనిపించిన ఈ పాటకు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ‘టిల్లు Square’ బృందం నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు పోస్టర్ కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులు ఇందులో ఉంటాయని పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ప్రచారం జరుగుతున్న ఈ సినిమాలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది.

‘టిల్లు Square’ బృందం నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు పోస్టర్

MF4TV: అనుపమ పరమేశ్వరన్ ఇన్ని రోజులూ తన హోమ్లీ లుక్స్‌తో ప్రసిద్ది చెందింది. అయితే, ఆమె ఈ రోజుల్లో కొత్త స్పైసి లుక్‌తో తనను తాను తిరిగి ఆవిష్కరించుకుంది మరియు ఇంటర్నెట్‌లో తన మనోహరమైన అందాలను ప్రదర్శించడం ప్రారంభించింది, ఆ తర్వాత ఆమె DJ టిల్లు సినిమా యొక్క సీక్వెల్, టిల్లు స్క్వేర్‌లో అడుగుపెట్టింది. జపాన్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.: జూనియర్ ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్(Square) టీజర్‌లో అనుపమ యొక్క అందమైన లుక్స్ మరియు మంత్రముగ్ధులను చేసే థ్రిల్స్‌ని మనం ఇప్పటికే చూశాము, అయితే రాధిక రాధిక పాట దానికి మరింత వైబ్ జోడించింది. ఇక్కడ టిల్లు స్క్వేర్ బృందం నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు పోస్టర్ వచ్చింది, ఇక్కడ అందమైన మల్లు అందం యొక్క బ్యాక్‌లెస్ లుక్ కనుబొమ్మలను ఆకర్షిస్తోంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ ఒడిలో కూర్చుని వీక్షకులకు వెన్నుపోటు పొడిచింది అనుపమ. వరుణ్ ధావన్ ,అలియా భట్‌తో ‘దుల్హనియా 3’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తాడో తెలుసుకోండి.

వరుణ్ ధావన్ ,అలియా భట్‌తో ‘దుల్హనియా 3’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తాడో తెలుసుకోండి.

MF4TV: హంప్టీ శర్మ కీ దుల్హనియా మరియు బద్రీనాథ్ కీ దుల్హనియా తర్వాత, వరుణ్ ధావన్ ఫ్రాంచైజీ యొక్క మూడవ విడత కోసం సిద్ధమవుతున్నాడు. తాజా నివేదిక ప్రకారం, శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించే చిత్రం కోసం వరుణ్ ధావన్ మరియు కరణ్ జోహార్ మధ్య చర్చలు జరుగుతున్నాయి మరియు ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది. నాగ్ యొక్క NSR టైటిల్ సాంగ్: వేడుకలు ప్రారంభం అభిమానులను నవ్వించేందుకు వరుణ్ ధావన్ మరోసారి వరుడిగా వస్తున్నాడు. హంప్టీ శర్మ కీ దుల్హనియా మరియు బద్రీనాథ్ కి దుల్హనియా విజయాల తర్వాత, వరుణ్ ఫ్రాంచైజీ యొక్క మూడవ విడతలో మళ్లీ వరుడిగా నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. జపాన్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.: జూనియర్ ఎన్టీఆర్ వరుణ్ ధావన్ రాబోయే చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత, అతను అలియా భట్‌తో కలిసి దుల్హనియా 3 షూటింగ్‌లో పాల్గొంటాడు. నివేదికల ప్రకారం, కరణ్ జోహార్ మూడవ విడత కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాడు.

మన దేశంలో 743 కొత్త కోవిడ్(Covid) కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి

MF4TV: భారత్‌లో గత 24 గంటల్లో 743 కొత్త కోవిడ్-19(Covid-19) కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం మొత్తం యాక్టివ్ కాసేలోడ్ ఏడు పెరిగి 3,997కి చేరుకుంది. అధికారిక సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో ఏడు మరణాలు నమోదయ్యాయి – కేరళలో మూడు కర్ణాటకలో రెండు, ఛత్తీస్‌గఢ్ మరియు తమిళనాడులో ఒక్కొక్కటి.

యువ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చిన MS ధోనీ.. వీడియో వైరల్‌

మిస్టర్‌ కూల్‌ మహీంద్ర సింగ్‌ ధోనీకి కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం. రాంచీలోని ధోనీ గ్యారేజ్‌ వీడియో ఇటీవలే వైరల్‌ అయింది. పదుల సంఖ్యలో క్లాసిక్‌ బైక్‌లు, కార్లు ఉన్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుమారు తన వద్ద 100 బైక్‌లు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో ధోని చెప్పారు. భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. రాంచీలోని క్రికెట్ స్టేడియానికి వెళ్తుండగా.. ఓ యువ క్రికెటర్‌కు బైక్‌పైన లిఫ్ట్ ఇచ్చిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ క్లాసిక్‌ మోడల్ యమహా RD350 బైక్‌ను డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ధోనీతోపాటు క్రికెట్‌ శిక్షణలో పాల్గొన్న ఓ యువ క్రికెటర్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు. లాంచీలోని ఓ స్టేడియంలో క్రికెట్‌ శిక్షణలో ధోనీ పాల్గొనగా.. అక్కడే మరో యువ క్రికెటర్‌ కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టిస్‌ తర్వాత ఆ యువకుడు ధోనీని లిఫ్ట్‌ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ధోనీ తన యమహా RD350 బైక్‌పైన లిఫ్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. బైక్‌ వెనుక సీట్‌పైన కూర్చు్న్న యువ క్రికెటర్‌ వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. బైక్‌ను చాలా హుందాగా డ్రైవింగ్‌ చేస్తున్న ధోనీ మేడ్‌ ఇన్‌ ఇండియా బ్రాండ్‌ అయిన తివ్రా హెల్మెట్‌ను ధరించారు. అయితే వెనుక కూర్చున్న యువ క్రికెటర్‌ మాత్రం ఎటువంటి హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేస్తున్నాడు. దీంతోపాటు ఈ వీడియోపై మరోరకమైన చర్చ నడుస్తోంది. యమహా RD350 బైక్‌ ఎగ్జాస్ట్‌ నుంచి తెల్లని పొగ ఎక్కువగా రావడంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న బైక్‌లు అంతటి పొగను వెదజల్లవు. అయితే ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఆనాటి ప్రభుత్వ బస్సులు ఇంత పొగను వెదజల్లేవి అంటూ కామెంట్లు చేస్తున్నారు. యమహా RD350 బైక్‌కు విపరీతమైన అభిమాని కారణంగా ఈ బైక్‌ను ధోనీ స్టాండర్డ్‌గా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ధోనీ బైక్‌ వెనుక కూర్చున్న యువ క్రికెటర్‌ హెల్మెట్‌ ధరించకపోవడంపై కొందరు కామెంట్లు చేస్తున్నారు. ధోనీకి బైక్‌లు, కార్లంటే చాలా క్రేజ్‌. అందువల్లనే ప్రత్యేక కలెక్షన్‌ను కలిగి ఉన్నాడు. 90లలో ఉపయోగించిన యమహా రాజ్‌దూత్‌ 350తో బైక్‌ల సేకరణ ప్రారంభించాడు. క్లాసిక్‌, ప్రముఖ మోడల్, విదేశీ స్పోర్ట్స్‌ బైక్‌లు, స్కూటర్‌ల సేకరణను కలిగి ఉన్నాడు. ధోనీ తన ఖాళీ సమయాల్లో రాంచీ చుట్టు షికార్లు చేస్తూ ఉంటాడు. ఈ వీడియోలు వైరల్ అవుతుంటాయి. డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

IMAX ఫార్మాట్ లో విడుదల కానున్న ‘లియో’

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘లియో’ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లియో అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం IMAX ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర USA డిస్ట్రిబ్యూటర్ అధికారికంగా ధృవీకరించారు. నార్త్ అమెరికాలో లియో అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.

గుబురు గడ్డంతో ఉన్నఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?

ఈ ఫొటోలో గుబురు గడ్డం పెంచుకుని బైక్‌ పై చక్కర్లు కొడుతోన్న టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా? కెరీర్‌ ఆరంభంలో ప్రేమకథా చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్నాడీ నటుడు. సోలో హీరోగా మెప్పించాడు. ఆ తర్వాత స్పెషల్‌ రోల్స్‌తో ఆడియెన్స్‌ను అలరించాడు. మళ్లీ ఇప్పుడు హీరోగా మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఫొటోలో గుబురు గడ్డం పెంచుకుని బైక్‌ పై చక్కర్లు కొడుతోన్న టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా? కెరీర్‌ ఆరంభంలో ప్రేమకథా చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్నాడీ నటుడు. సోలో హీరోగా మెప్పించాడు. ఆ తర్వాత స్పెషల్‌ రోల్స్‌తో ఆడియెన్స్‌ను అలరించాడు. మళ్లీ ఇప్పుడు హీరోగా మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో కనిపిస్తున్నది మరెవరో కాదు.. టాలీవుడ్ హీరో నవదీప్‌. అతను నటిస్తున్న తాజా చిత్రం లవ్‌ మౌళి. ఇందులో గతంలో ఎప్పుడూ చూడలేని విధంగా పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు నవదీప్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్‌ పై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఇదే మూవీ నుంచి ‘ద ఏంథమ్ ఆఫ్ లవ్ మౌళి’ పాటను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులోనూ సరికొత్త మేకోవర్‌తో కనిపించాడు నవదీప్‌. సరికొత్త మేకోవర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం నవదీప్‌ లుక్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లవ్‌ మౌళి కు అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్న ఈ లో పంఖురి గిద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇటీవల డ్రగ్స్‌ పేరులో నవదీప్‌ పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

నాంపల్లి కోర్టు మెట్లెక్కిన ఏజెంట్ వివాదం.. భోళా శంకర్ నిర్మాతలపై క్రిమినల్ కేసు!

యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ వ్యవహారం నిర్మాతలను, డిస్టిబ్యూటర్లను ఇంకా వెంటాడుతున్నది. ఆ సినిమా నష్టాల వివాదం కేవలం ఏజెంట్‌కు మాత్రమే పరిమితం కాకుండా భోళా శంకర్ సినిమాకు పాయింది. తాజాగా భోళా శంకర్ సినిమా నిర్మాతలపై డిస్టిబ్యూటర్లు కోర్టులో కేసు నమోదు చేశారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల వ్యవహారంలో నిర్మాతలు చీటీంగ్ చేశారని డిస్డిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్) వెల్లడించారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే.. అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారు. ఆ సినిమా నైజాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల హక్కుల కోసం 30 కోట్ల రూపాయలు బ్యాంక్ ద్వారా చెల్లించాను. అయితే చివరి నిమిషంలో కేవలం వైజాగ్ హక్కులు మాత్రమే నాకు కేటాయించారు. ఆత ర్వాత నిర్మాతలను సంప్రదిస్తే.. భోళా శంకర్ సినిమా రిలీజ్‌కు ముందు డబ్బు తిరిగి ఇస్తాం అని చెప్పారు. ఆ మేరకు అండర్ స్టాండింగ్ లెటర్ కూడా ఇచ్చారని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. గత 13 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాను. రంగస్థలం లాంటి భారీ సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేశాను. అఖిల్ సినిమా విషయంలో నాకు తీవ్ర అన్యాయం జరిగింది. డబ్బు చెల్లించకపోగా మాట్లాడటానికి కూడా నిరాకరించారు. ఆ క్రమంలో కోర్టును ఆశ్రయించగా, పటిషన్ దాకలు చేసుకోమని చెప్పారు. దాంతో న్యాయపోరాటం చేసేందుకు రెడీ అయ్యాను అని సతీష్ చెప్పారు. ఈ క్రమంలో నాంపల్లి క్రిమినల్ కోర్టులో నిర్మాతలపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశాం అని తెలిపారు. బత్తుల సత్యనారాయణ (సతీష్) తరఫు న్యాయవాది కేశాపురం సుధాకర్ మాట్లాడుతూ.. ఏజెంట్ నిర్మాత చీటింగ్ చేశారనే కేసులో కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సతీస్‌కు జరిగిన అన్యాయానికి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తాం. నిర్మాతలపై రికవరీ సూట్ ఫైల్ చేశాం. నాంపల్లి క్రిమినల్ కోర్టులో సతీష్ ను మోసం చేసిన భోళా శంకర్ నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, ఇంకా వారి సంస్థకు చెందిన గరికపాటి కిషోర్ పై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం,వంటి వివిధ సెక్షన్స్ కింద కేసులు రిజిస్టర్ చేశాం అని తెలిపారు. ఏజెంట్ హక్కుల వివాదంపై సతీష్‌కు నిర్మాత నట్టి కుమార్ అండగా నిలిచారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. వారిని ఇటీవల మోసం చేయడం ఓ అలవాటుగా మారింది. బాధితులకు న్యాయం చేయాల్సిన నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్లు మోసగాళ్లకే సహాయం చేస్తున్నాయి. ఇలాంటి విషయాలు చాలా బాధ కలిగిస్తున్నది. సతీష్‌కు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం అని నట్టి కుమార్ చెప్పారు. ఐటీ, జీఎస్టీ కట్టకుండా మోసం చేస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది.వాటిపై కూడా సంబంధిత విభాగాలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. పవన్ కల్యాణ్ బ్యాక్ ఆన్ సెట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)-శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న యాక్షన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat singh). హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) చేసిన ట్వీట్ అందులోని పవన్ కల్యాణ్ షూటింగ్ టైమ్ లో పిక్స్ వైరల్ అవుతున్నాయి. ‘అందరూ ఊపిరి బిగపట్టుకోండి బాయ్స్ అండ్ గర్ల్స్.. వస్తున్నాడు భగత్ సింగ్. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టింది. ఇప్పటి నుంచి నాన్ స్టాప్ గా జరిగే షూటింగ్ లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ షెడ్యూల్స్ జరుగనున్నాయి’ అని ట్వీట్ చేసింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ లో పవన్ కల్యాణ్ అప్పీయరెన్స్, డైలాగ్స్, స్టయిల్ ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్‌తో బాలయ్య: రాజమండ్రికి- క్యాస్ట్ ఈక్వేషన్స్ కలిసొస్తాయా?

రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని, దర్యాప్తు సాగిస్తోన్నారు. ఇక చంద్రబాబును ములాఖత్ అయ్యే ప్రముఖుల లిస్ట్ పెరుగుతోంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. భార్య భువనేశ్వరి, కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి.. చంద్రబాబును కలుసుకున్నారు. ఈ ములాఖత్ సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనాన్ని అందించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సైతం చంద్రబాబును కలుసుకోనున్నారు. దీనికోసం రేపు ఉదయం 10 నుంచి 10:30 గంటల మధ్యలో వారు రాజమండ్రికి రానున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ కరకట్ట ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ సెట్స్‌పై ఉన్నారు. హైదరాబాద్‌లో ఉంటోన్నారు. బాలకృష్ణ కూడా హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. వారంతా మళ్లీ వేర్వేరుగా రేపు రాజమండ్రికి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు అధికారులు. కాగా.. పవన్ కల్యాణ్‌ ములాఖత్‌కు సంబంధించి ఇప్పటివరకు తమకు ఎటువంటి దరఖాస్తులు రాలేదని జైలు సూపరిండెండెంట్ పేర్కొన్నారు.

బాబును రిమాండ్‌కు పంపడంపై పూనమ్ కౌర్ రియాక్షన్

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని, దర్యాప్తు సాగిస్తోన్నారు. అదే సమయంలో బెయిల్ కోసం చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. క్వాష్ పిటీషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఇక తాజాగా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు వద్ద జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తోన్నారు చంద్రబాబు. ఈ ఘటనలో చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన దగ్గరుండి తన పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టడం వల్లే అంగళ్లు వద్ద పెద్ద ఎత్తున అల్లర్లు సంభవించాయని, పలువురు పోలీసులు గాయపడ్డారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది నేడు విచారణకు రానుంది. చంద్రబాబు అరెస్ట్ కావడం, రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ కస్టడీని ఎదుర్కొంటోండటంపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. జరిగిన విషయాలేవీ తనకు తెలియవని అంటూనే చంద్రబాబును కటకటాల వెనక్కి నెట్టడం పట్ల ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో స్పందిస్తోన్నానని పేర్కొన్నారు. 73 సంవత్సరాలు అంటే జైల్లో గడపాల్సిన వయస్సు కాదని పూనమ్ కౌర్ అన్నారు. ప్రత్యేకించి- సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉంటూ సేవలు అందించిన అనంతరం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ఇలా జైలుకు వెళ్లాల్సి రావడం బాధాకరమని చెప్పారు. జరుగుతున్న విషయాలపై తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ- మానవత్వంతో స్పందిస్తున్నానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

డీజే టిల్లుతో జోడి కట్టనున్న బేబీ హీరోయిన్?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ- బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) హీరోయిన్ గా నటించబోతుందనే తెలుస్తోంది. బేబీ హిట్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది వైష్ణవి. అందులో ఈ అమ్మడు యాక్టింగ్ కు ఫిదా అవ్వని యూత్ ఎవరూ ఉండరు. దీంతో ఈమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామ్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సిద్ధూ సినిమాలో అవకాశం దక్కించుకుంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్'(Tillu Square)లో నటిస్తున్నాడు. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధు నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ పై మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి రామ్‌ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. టైటిల్‌కు తగ్గట్టుగానే డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించబోతున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఈ చిత్రాన్ని అక్టోబరు 06న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

సలార్ రిలీజ్‌పై అధికారిక ప్రకటన..

తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగిపోయింది. అందుకు చాలా మంది హీరోలు కారణం అయ్యారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సి పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌దే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా అతడు తనదైన చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూనే వెళ్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తోన్న చిత్రమే ‘సలార్ – సీజ్‌ఫైర్’. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మూవీ రిలీజ్‌పై అనుమానాలు వచ్చాయి.   వాస్తవానికి ‘సలార్’ మూవీ రిలీజ్ సెప్టెంబర్ 28వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే, ఉన్నట్లుండి ఈ సినిమా బుకింగ్స్ ఆగిపోవడంతో ఇది వాయిదా పడుతుందన్న టాక్ మొదలైంది. అదే సమయంలో ఎన్నో చిత్రాలు సెప్టెంబర్ 28కి వాయిదా పడ్డాయి. ‘సలార్’ మూవీ వాయిదా కన్ఫార్మ్ అయినా చిత్ర యూనిట్ మాత్రం అధికారిక ప్రకటన చేయకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆశను పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా నిర్మాణ సంస్థ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌ ఖాతాలో ఓ ప్రకటనను వదిలింది. ఇందులో అనుకోని పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. హొంబళే సంస్థ ట్విట్టర్ ఖాతాలో ‘సలార్ మూవీకి మద్దతు ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మేము సలార్ మూవీని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలి. కానీ అనుకోని కారణాల వల్ల దీన్ని వాయిదా వేస్తున్నాము. మీకు అసాధారణమైన అనుభవాన్ని అందించాలన్న దానికి కట్టుబడి ఉన్నాము. అందుకోసం మా యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌ను నిర్ణీత సమయంలో ప్రకటిస్తాము. దయచేసి మేము ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామో అర్థం చేసుకోండి. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం అయినందుకు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చింది.   ఇదిలా ఉండగా.. ‘సలార్’ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే.  

దేశవ్యాప్తంగా కోర్టుల్లో విచారణ సాగుతున్న కేసులపై మీడియా సమాంతరంగా విచారణలు

దేశవ్యాప్తంగా కోర్టుల్లో విచారణ సాగుతున్న కేసులపై మీడియా సమాంతరంగా విచారణలు నిర్వహించడంపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో సాగే పక్షపాత రిపోర్టింగ్ వల్ల సదరు నిందితుడు నేరం చేశాడనే అనుమానాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అడ్డుకునేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర హోంశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్రాల డీజీపీలు, జాతీయ హక్కుల కమిషన్ కూడా నెలరోజుల్లో సూచనలు ఇవ్వాలంది. మీడియాలో సాగే విచారణల వల్ల కోర్టుల్లో సాగే న్యాయవిచారణ ప్రభావితమవుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో పోలీసు సిబ్బందికి కూడా అవగాహన కల్పించాలన్నారు.ఏ దశలో దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయాలో వారు నిర్ణయించుకోవాలని తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య అని,ఎందుకంటే ఇది బాధితుల, నిందితుల ప్రయోజనాలతో ముడిపడి ఉంటుందని తెలిపారు. అలాగే ప్రజాప్రయోజనాలను కూడా కలిగి ఉంటుందన్నారు. ప్రాథమిక స్థాయిలో ఆలోచనలు, వార్తలను చిత్రీకరించడానికి, ప్రసారం చేయడానికి మీడియాకు ఉన్న హక్కు రెండింటిలోనూ ప్రసంగం, భావవ్యక్తీకరణ యొక్క ప్రాథమిక హక్కుతో నేరుగా ప్రమేయం కలిగి ఉందని సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. కానీ మనం ‘మీడియా విచారణ’ని అనుమతించకూడదన్నారు. ప్రజలకు చర్చించే హక్కు ఉన్నా, విచారణ సమయంలో ముఖ్యమైన సాక్ష్యాలు వెల్లడైతే, దర్యాప్తును కూడా ప్రభావితం చేయవచ్చని తెలిపారు. ఇదే అంశంపై 2017 నాటి సూచనలకు సంబంధించిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారిస్తోంది. నిందితులు, బాధితురాలి హక్కులను దృష్టిలో ఉంచుకుని పోలీసు బ్రీఫింగ్‌ల కోసం నిబంధనలను రూపొందించాలని, ఇరుపక్షాల వారు ఏ విధంగానూ పక్షపాతం లేదా ఉల్లంఘించకుండా చూసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ముసాయిదా నివేదికను సమర్పించేందుకు కేంద్రానికి కోర్టు ఆరు వారాల గడువు ఇచ్చింది. ఏపీలో ప్రస్తుతం విపక్ష నేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై పలు జాతీయ మీడియా ఛానళ్లతో పాటు రాష్ట్రంలోని ప్రాంతీయ మీడియా ఛానళ్లలోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు తప్పుచేశారని కొందరు, చేయలేదని మరికొందరు తమ వంతు విచారణలు నిర్వహించేస్తున్నారు. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు చంద్రబాబు ఎపిసోడ్ లో మీడియా పనితీరుకు అద్దం పట్టేలా ఉన్నాయి.

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE